Wednesday, 17 April 2013



ఏడవ శతాబ్ధంలో అరేబియన్ ఎడారుల్లో ఇస్లాం పుట్టినప్పటి నుంచీ West కీ, East లో ముఖ్యభాగమైన ఇస్లాం సొసైటీస్ కీ మధ్య చాలా ఘర్షణలే జరిగాయి. మొహమ్మద్ అనుచరులు, క్రైస్ట్ అనుచరుల మీద జిహాద్ ప్రకటించటమూ, దానికి సమాధానంగా క్రిస్టియన్స్ క్రూసేడ్స్ జరపడమూ, తద్వారా స్పెయిన్ నీ, పోర్చుగల్ నీ తిరిగి స్వాధీనం చేసుకోవడమూ మనందరికి తెలిసిన విషయమే. దాదాపు మూడు వందల సంవత్సరాల పాటు జరిగిన ఘర్షణల్లో అడపాదడపా ఓటమి చవిచూట్టము తప్ప, ఈ Clash of Civilizations లో West క్రమం తప్పకుండా నెగ్గుకుంటూ వచ్చింది.

దీనికి ఒక ముఖ్యకారణం Western Science యొక్క పైచేయి. అయితే, ఈ ఆధిక్యం West కి మొదటినుంచీ లేదు.
అదెలాగో చూద్దాం.

మొహమ్మద్ అనుచరులు ఎనిమదవ శతాబ్ధంకల్లా ఇటు స్పెయిన్, ఉత్తర ఆఫ్రికా, అరేబియన్ ప్రాంతాలలో, ఉత్తరాన సిరియా, తూర్పున పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ ల వరకీ ఒక Caliphate (an Islam state ruled by Muhammad's successor) ని నిర్మించారు.
అలా ఏర్పడిన వాటిల్లో Abbasid Caliphate ఆ కాలంలో సైన్స్ లో అందరికన్నా ముందుండేది.


An artist imagination of Science & Technology in Abbbasid Caliphate
 
Modern Al-Karaouine Bayt al-Hikma


















  • తొమ్మిదవ శతాబ్ధంలో Caliph Rashid బాగ్దాద్ లో నిర్మించిన Bayt al-Hikma (House of wisdom) లో గ్రీక్ లో రాసిన అరిస్టాటిల్ రాసిన గ్రంథాలన్నీ అరబిక్ భాషలోకి అనువదించబడి ఉండేవి.
  • Caliphate ఆ కాలంలోనే ఆస్పత్రులని నిర్మించాయని చెపుతారు. ఉదాః 707 లో Damascus లో Caliph al-Waleed నిర్మించిన bimartisan. 
  • AD 859 లో Fez స్థాపించిన University of Al-Karaouine ని ఉన్నత చదువుల సంస్థగా పరిగణించేవాళ్ళు.
 గ్రీక్ మాథమేటిక్స్ మూలాల మీదే కాకుండా, ముఖ్యంగా Indian Mathematical Foundations ఆధారంగా ముస్లిం మాథమేటిషియన్స్ Algebra (from the arabic al-jabr, meaning 'restoration') ని నిర్మించగలిగారు. క్రీ.శ.820 లోనే మొట్టమొదటి ఆల్జీబ్రా పుస్తకం (Hisab al-Jabr W'al-Musqabalah) ని అరబిక్ భాషలో పర్షియన్ స్కాలర్ Muhammad ibn Musa al-Khwarizmi రచించాడు.

మొట్టమొదటి Experimental scientist ఒక ముస్లిం అయిన Abu Ali al-Hasan ibn al-Haytham (AD 965-1039). అప్పటివరకీ "కళ్ళు కాంతిని వెదజల్లుతూ ఉంటాయి కాబట్టి, చూడగలుగుతామనే" లాంటి ఎన్నో మూఢనమ్మకాలని ఆయన రచించిన Book of Optics తోసిపారేసింది. ఇతనే మొట్టమొదటి సారిగా నక్షత్రాలు, Solid-Bodies కావనీ గుర్తించాడు. అంతే కాదు, ఈ రోజుకి కూడా స్కూలు పిల్లలకి Optics ని పరిచయం చేసేప్పుడు ఉపయోగించే pinhole camera ని ఈయనే నిర్మించాడు.

Cartography, Medicine, Philosophy, Mathematics and Optics లో అప్పటివరకీ ముస్లిం ప్రపంచం సాధించిన ప్రగతికీ, అలాగే గ్రీకుల Claasical Wisdom ని భధ్రపరచినందుకూ కూడా ముస్లిం ప్రపంచానికి, West ఒక విధంగా ఋణపడి ఉంది. English Thinker Roger Bacon 'Phioslophy is drawn from Muslims' అన్న మాటల్లో ఆ విషయాన్ని గమనించవచ్చు.

మరి Science లో ముస్లిం ప్రపంచం, వెస్ట్ కన్నా ఎలా వెనకపడిపోయింది? ఆ ప్రశ్నకి సమాధానమూ, అలాగే సైన్సులో వచ్చిన విప్లవాలు వెస్టర్న్ సివిలైజేషన్ కి, మిలిటరీ రంగంలోనూ, శాస్త్రీయ రంగంలోనూ ప్రపంచం మీద ఎలా ఆధిపత్యాన్ని అందించాయో తెలుసుకోవాలంటే పదిహేడవ శతాబ్ధం కి వెళ్ళిరావాలి.

***

 THE SIEGE

అది 1683వ సంవత్సరం.

1529 లో జరిగినట్లుగానే Ottoman సైన్యం, వియన్నా ద్వారాల వద్ద మరోసారి మోహరించి ఉన్నది. 

The vienna siege 1683

1453 లో Constantinople ని ఆక్రమించుకున్నప్పటినుంచీ Ottomans ఇస్లాం కి ప్రతినిధులయ్యారు. ఇస్లాంని , Christian భూభాగాలైన Bulgaria, Serbia, Hungary లోకి వ్యాప్తి చెందించారు. 1521 లో Belgrade Ottomans చేతుల్లోకి వచ్చేసింది. Buda 1541 లో. బాగ్ధాద్ నుంచీ బాస్రా వరకీ, ఎర్రసముద్రం ముఖద్వారం లోని Van నుంచీ Aden వరకీ, Barbery Coast లో Algiers నుంచీ Tripoli వరకీ వ్యాప్తి చెందిన సామ్రాజ్యం తో Suleiman-the-Magnificient, ఇస్లాం రాజుల్లోకెల్లా రారాజయ్యాడు. స్వయాన కవీ కూడా అయిన సులేమాన్, చాకచక్యంగా మతాన్నీ, పొలిటిక్స్ నీ, ఎకానమీని కలిపి పరిపాలించగలిగాడు. అంత పెద్ద రారాజయిన తనకి Roman Emperor Charles-V కేవలం వియన్నాకి రాజుగా మాత్రమే కనపడ్డాడు. అలాగే పోర్చుగీస్ వ్యాపారులు సముద్రపు దొంగలుగానూ గోచరించారు.

పదిహేడవ శతాబ్ధం వచ్చేకల్లా Ottoman సామ్రాజ్యం ఇంకా విస్తరించింది. 1669 లో Crete పడిపోయింది. Western Ukraine లోకి కూడా సుల్తాన్ చొచ్చుకొని పోగలిగాడు. 1682 లో సుల్తాన్ తన మొదటి పావు కదిపి తన బలగాలని వియన్నా వైపు నడిపించాడు.

13 July 1683 కల్లా వియన్నా ద్వారాల వద్ద 60,000 సిపాయిలు, 80,000 ఇతర మిలిటరీ సిబ్బందీ తిష్టవేసారు.
Byzantium నుంచి వచ్చిన ముస్లిం సైన్యాలు రోమ్ లోని క్రిస్టియన్లకి హడలెత్తించాయి. యముడి మహిషపు లోహ ఘంటలు యూరప్ నిండా మోగాయి. విజయం తథ్యమన్న నమ్మకంతో Kara Mustafa తన టెంట్ ముందు గార్డెన్ నిర్మించుకున్నాడు. Viennese కి ఆహారపదార్ధాల ద్వారాలని మూసివేసి, వారిని లొంగుబాటుకు గురిచేయగలమన్న నమ్మకం Turks లో వచ్చింది. ఆ సంగతి వారి యుద్ద విన్యాసాల్లో, కదలికల్లో, యుద్దభేరుల్లో స్పష్టంగా వియనీస్ కి తెలుస్తూనే ఉంది. Turks, 25th July న తమ శత్రువు మొట్టమొదటి రక్షణశ్రేణులని ఛేధించారు. ఇంకో భారీ విస్ఫోటనం తో Austrians entrenchment at ravelin తో , త్రిభుజాకారంలో బంధించారు. 4th September న ఏకంగా సెంట్రల్ ఫోర్ట్ మీదనే దాడి చేసారు.

కాని అప్పుడే Kara Mustafa కాస్త తత్తరపడ్డాడు. శీతాకాలపు తొలి ఘడియలు మొదలయ్యాయి. ఆయన సైన్యాలకి కావలసిన అత్యవసర సామాగ్రి నిల్వలు తగ్గుమొఖం పట్టాయి. అప్పుడే రోమ్ రాజు Leopald పోలండ్ రాజుతో పరస్పరం రక్షించుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ మరుక్షణం 60,000 పోలిష్ సైన్యం వియన్నా వైపు యుద్దనడక మొదలెట్టింది. 12 September 1683 కల్లా ఎదురుదాడి రాకెట్ ఫైర్ తో మొదలయ్యింది. రోజంతా సాగించిన ఎదురుదాడిలో ముఖ్యమైన స్థావరాలని కైవసం చేసుకోని, ఆ సాయంత్రం కల్లా పోలిష్ దళాలు వియన్నా ఎదురునున్న కొండ పైనుంచి శత్రుశిబిరంలోకి ఉరకలు పెట్టాయి. రాత్రికల్లా Kara Mustafa టెంట్ లోకి చొరబడ్డాయి. అప్పటికే Kara Mustafa పరారయ్యాడు. చివరకి Ottomans వియన్నాని ఆక్రమించే ప్రయత్నం, ముస్తాఫా పరారీతోనూ, ఓటమిలో Kara Mustafa తనకు తను మృత్యుదండనని విధించుకోవడంతోనూ ముగుస్తుంది. ఈ రెండవ ఆక్రమణ వైఫల్యం, Ottoman empire పతనానికి నాంది పలుకుతుంది. ఆ తరవాత జరిగిన వరస యుద్దాల్లో, Ottomans ని యూరప్ లో సులేమాన్ ఆక్రమించిన దాదాపు ప్రతీ ప్రాంతం లోంచి తరిమికొడతారు. Hungary , Transylvania ని వదులుకోవాల్సి రావటం Ottoman కి భారీ అవమానం.

శతాబ్ధాల క్రిస్టియన్ - ముస్లిం సంఘర్షణలో వియన్నా ఓటమి ఒక పెద్ద మలుపు. West rising లో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆ తరవాత జరిగిన ఘర్షణల్లో కూడా వెస్ట్ కి వరసగా పై చేయి లభించడానికి కారణాలని జాగ్రత్తగా అన్వేషిస్తే రెండు విషయాలు స్పష్టమవుతాయి. 1.సైన్స్ ద్వారా సాధించిన ప్రగతి మిలటరీ రంగంలో ఉపయోగించడమూ, 2) మతనిర్దేశన కన్నా హేతువు కి ప్రభుత్వం పెద్దపీట వేయడం.


 
Ottoman వియన్నా ఆక్రమణ వైఫల్యం జరిగిన 1683 ప్రాంతంలోనే, యూరప్ లో ఫిలాసఫీ, పొలిటికల్ థియరీ రంగాల్లో అతివేగవంతమైన మార్పులు జరుగుతున్నాయి. ఆ రోజుల్లో సైన్స్ ఫిలాసఫీ లో ఒక భాగం. 1687 లో న్యూటన్ తన Principia of Mathematics ప్రచురించాడు. మూడేళ్ళ తర్వాత John Locke, Second Treatise of Government ని ప్రచురించాడు


 ***

MICROGRAPHIA

 యూరప్ లో సైంటిఫిక్ విప్లవానికి మూలాలు Church - State ని సెపరేట్ గా ఉంచాలన్న ఆదర్శంలో ఉన్నాయి. "Render therefore to Caesar the things that are Caesar's; and unto God the things that are God's" (Matthew 2.2:21) అన్న సూక్తి, ఖురాన్ లో 'Indivisibility of God's law as revealed to Prophet' సూత్రానికి ఎంతో భిన్నమైనది.

యూరప్ 1500 లకి ముందు కనీళ్ళల్లో మునిగి ఉండేదేమో కానీ అజ్ణానంలో కాదు. Muslim world తో సంపర్కం Renaissance period లో claasical learning కి బాగానే దోహదపడింది. 12 వ శతాబ్ధంలోనే Polophany ని కనుక్కోవటం, 15వ శతాబ్దంలో Brunelleschi పెయింటింగ్ లో ఒక linear perspective నీ కనిపెట్టటం జరిగింది. మొట్టమొదటి నవల La vida de Lazarillo de Tormes (1500) లో రాయడం జరిగింది. కానీ Reanaissance పీరియడ్ కన్నా ముఖ్యమైన మలుపులు 1517 తర్వాత క్రిస్టియానిటీ ముక్కలు ముక్కలుగా విడిపోయిన వైనంలోనూ, దాంట్లో జరిగిన మార్పుల ద్వారానూ వచ్చాయి.

ఇంత గొప్ప మార్పుకు కారణం ప్రింటింగ్ ప్రెస్. ఇండస్ట్రియల్ రివల్యూషన్ లో అత్యంత ప్రభావితమైన ఇన్నొవేషన్.

Gutenberg printing-press Gutenberg printing-press workshop















గూటెన్ బర్గ్, మెటల్ తో నిర్మించిన కదిలే ప్రింటింగ్ ప్రెస్ చైనీస్ ప్రింటింగ్ ప్రెస్ కన్నా ఎన్నో రెట్లు సౌలభ్యవంతమైనదీ, అధునాతనమైనదీ. ఎంతో శక్తివంతమైన ఈ టెక్నాలజీ, గూటెన్ బర్గ్ ఆశించినట్లుగా మొనాపలీగా ఉంచలేకపోయారాయన. ఇది కనుక్కున్న కొన్నేళ్ళల్లోనే యూరప్ నిండా కనీసం పదహారు నకళ్ళు బయలుదేరాయి. 1500 కల్లా ఒక్క జర్మనీ లోనే 200 ప్రింటింగ్ షాప్స్ వచ్చాయి. 1519 కల్లా ఒక వెయ్యి ప్రచురణలు మార్కెట్ లోకి వచ్చాయి.

ఈ టెక్నాలజీతో అన్నిటికన్నా ఎక్కువ లాభపడిన రచయిత థియాలజీ ప్రొఫెసర్, ఒకప్పటి ప్రీస్ట్ అయిన Martin Luther. ఇతనూ, Johann Grunenberg కలిపి రోమన్ కాథలిక్ చర్చ్ ప్రాక్టీసెస్ మీద రాసిన విమర్శల శీర్షికలతో  జర్మన్ మార్కెట్ ని నింపేసారు (ref: Theologia Deutsch, Seven Penitential Psalms)

Luther చర్చ్ కి వ్యతిరేకంగా రాసిన Ninety-Five Theses మొదట్లో ప్రచురించకపోయినా, కొన్నేళ్ళలోనే ఆ పత్రాలన్నీ జర్మనీ అంతా లభ్యమయ్యాయి. నిజానికి చర్చ్ కి వ్యతిరేకంగా రచనలు కొత్త ఏమీ కాదు. అంతకు చాలా ముందే Jan Hus పోప్ ని, చర్చ్ ప్రాక్టీసెస్ నీ సవాల్ చేస్తూ రాసాడు, కానీ అప్పటికి ప్రింటింగ్ ప్రెస్ అందుబాటులో లేకపోవటం వల్ల, వాటిని సామాన్య ప్రజలకి విరివిగా అందుబాటులోకి రాకుండా దారుణంగా అణచివేయగలిగారు. ప్రింటింగ్ ప్రెస్ ఆ అణచివేతని అసాధ్యం చేయడమే కాక, Luther works ని దేశం నలుమూలలా ఉన్న ప్రజల చేరువలోకి తెచ్చింది. 1517 నుంచి 1520 మధ్యలో ఆయన ప్రచురించిన 370 editions లో, ఒక్కొక్క edition కి వెయ్యి కాపీలు ప్రింట్ చేసినా, దాదాపు మూడు లక్షల ప్రతుల రచనలు సర్కులేషన్ లోకి వచ్చాయి. 1521-1545 మధ్య క్రిస్టియానిటీ రిఫార్మ్ స్ రచనల్లో సగం Martin Luther వే.

గమ్మత్తేమిటంటే, ఇదే కాలంలో New Testament మొట్టమొదటిసారిగా 1526 లో ప్రింట్ చేయబడింది. మత అతివాదులకి Scriptures ఇలా సామాన్యులకి చదువుకోవడానికి అందుబాటులోకి రావడం ఇష్టం లేకపోయినప్పటికీ, ప్రింటింగ్ ప్రెస్ టెక్నాలజీ శక్తితో పోటిపడలేకపోయారు. చివరకి వాళ్లు కూడా ఆ ప్రింట్ ప్రపంచపు పోటీలోకి రాక తప్పలేదు. ఇవేకాదు, ఎక్కడో స్కాలర్స్ కి మాత్రమే అందుబాటులో ఉండే అరిస్టాటిల్ రచనలూ, Pro-reform humanists Nicolaus Marschalk, George Sibutus రచనలూ కూడా సామాన్య ప్రజల ముంగిట్లోకి వచ్చేసాయి. 1500 ల తొలినాళ్ళల్లో ఒక వెయ్యి మాధమేటికల్, సైంటిఫిక్ రచనలు ప్రింట్ లోకి వచ్చాయి. 
వీటిల్లో ముఖ్యమైనవి: 1417 లో కనిపెట్టబడిన Luretius' De natura rerum, Roman compiliation of Greek Medical Science, Latin versions of Archimedes works. ఇటాలియన్ ప్రింటర్స్ ఎన్నో arithmetical and accounting techniques రచనల ని ప్రింటింగ్ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు ఉదా: Treviso Arithmetic (1478) Luca Pacioli's Suma de arithmetica, geometria.

అయితే ప్రింటింగ్ ప్రెస్ నుంచి వచ్చినదంతా మానవ సమూహ సజ్ణానానికి సహాయం చేసిందని చెప్పలేం. పదహారవ, పదిహేడవ శతాబ్ధాల్లో బోల్డన్ని వినాశకర రచనలు ప్రచురించబడ్డాయి. 1487-1669 మధ్యలో Malleus maleficarumలో Witches ని అంతమొందించాలన్న సందేశంతో యూరప్ లో 12000-45000 మందిని, అందులో ఎక్కువశాతం మహిళలని చంపేయడం జరిగింది. ఇలాంటి ఉదాహరణలే ఇంకా గమనించవచ్చు.

ఇక్కణ్ణుంచి ముందుకెళ్తే 1665 లో Robert Hooke ప్రచురించిన Micrographia గ్రంధం, Scientific Empiricism సాధించిన విజయాల సెలబ్రేషన్స్ కి చిహ్నం. టెలిస్కోప్ ద్వారా ఎంత దూరం చూడొచ్చో, మైక్రోస్కోప్ ద్వారా అంత లోతుల్లోకీ చూడొచ్చన్న విషయం అర్ధమయ్యాక, మానవ మేధకి ఎంతో కొత్త ప్రపంచం తెరుచుకుంది. Organic Matter యొక్క అతిచిన్న యూనిట్ కి Hooke ఉపయోగించిన పదం 'cell', తదుపరి జరిగిన ఎన్నో పెనువిప్లవ అన్వేషణలకీ నాంది పలికింది. 


సైంటిఫిక్ విప్లవం, గ్రహాల కదలికల అధ్యయనంతోనూ, Blood Circulation Studies తోనూ మొదలయ్యే ఉండొచ్చు గాక, కానీ Hooke's microscope అప్పటివరకీ మానవుడి కంటికందని ప్రపంచాన్ని, తనముందుకు అధ్యయనానికి తీసుకొచ్చింది.

అయితే కొత్తగా దూసుకొస్తూన్న సైన్స్ కేవలం అబ్జర్వేషన్ కి సంబంధించిందే కాదు. గెలీలియో తో మొదలయిన సిస్టమేటిక్ ప్రయోగాలు, కొత్త మాధమేటికల్ రిలేషన్ షిప్స్ ని తెరమీదకి తీసుకొచ్చాయి. ఈ మాధమేటిక్స్ ని న్యూటన్, లెబ్నిజ్ ఇంకా విస్తృతపరచారు. సైంటిఫిక్ రివల్యూషన్ ఫలితాలు ఫిలాసఫీ లో కూడా విప్లవాలని తీసుకొచ్చాయి. Descartes, Spinoza అప్పటివరకి Perception, Reason మీద నెలకొని ఉన్న సిద్దాంతాలని తోసిపుచ్చారు. ఈ కాలంలో జరిగిన ఎన్నో ఇంటలెక్చువల్ ఇన్నోవేషన్స్ , ఈరోజు మనకి తెలిసిన మోడర్న్ అనాటమీ, ఆస్ట్రానమీ, బయాలజీ, కెమిస్ట్రీ, జియాలజీ, జామెట్రీ, మేధమేటిక్స్, మెకానిక్స్, ఫిజిక్స్ లకి జన్మనిచ్చాయి అంటే అతిశయోక్తి కాదు. ఈ రివల్యూషన్ యొక్క ప్రభావం, లక్షణం 1530 to 1789 మధ్యలో జరిగిన అతి ముఖ్యమయిన 29 కీలకమయిన ఇన్నోవేషన్స్ చూసి తెలుసుకోవచ్చు. (*లిస్ట్ ఈ పోస్ట్ చివరన కింద ఇవ్వబడింది).

ప్రపంచపు హిస్టరీ ఆఫ్ సైన్స్ అన్ని పుస్తకాలలో కనపడే 369 అతి ముఖ్యమైన సైంటిఫిక్ మలుపుల్లో, అత్యధికంగా...38 శాతం సైంటిఫిక్ ఇన్నోవేషన్స్, Reformation period నుంచీ French Revolution మధ్యకాలంలో జరిగినవే అంటే, ఈ పీరియడ్ ప్రభావాన్ని అంచనా వేసుకోవచ్చు.



1600 మధ్యలో కల్లా, ప్రింటింగ్ ప్రెస్, పోస్టల్ సర్వీసెస్ ల సహాయంతో సైంటిఫిక్ నాలెడ్జ్ యూరప్ అంతా, అతివేగంగా విస్తృతమవుతూ వచ్చింది. ఇంత వేగంగా వచ్చిన సైంటిఫిక్ విప్లవాల ఫలితాలని, అప్పటివరకీ స్థిరపడిపోయి ఉన్న
Christian Doctrine తో సంధానం చేసుకోవడం మహామహులకే కష్టతరమయింది. సాక్షాత్తూ Newton, Hooke లే ఎంతో ఇబ్బందిపడ్డారు. కానీ ఈ ఇంటలెక్చువల్ రివల్యూషన్, దాదాపు ఒక శతాబ్దపు ముందు వచ్చిన రిలీజియస్ రివల్యూషన్ కన్నా ఎంతో శక్తివంతమైనదీ, ఎన్నో విప్లవాత్మకమైన మార్పులని సంఘంలో తీసుకొచ్చింది అని చెప్పకమానదు.

Eurocentrism అన్నమాట అంటే చాలు కొంతమంది ఉలిక్కిపడతారు. అదొక ప్రిజుడిస్ పదమనీ, డిస్టేస్ట్ ఫుల్ పదమని కొంతమంది భావన. కానీ సైంటిఫిక్ రివల్యూషన్ పూర్తిగా ముమ్మాటికీ Eurocentric దే. ఏరకంగా కొలిచి చూసినా, సైంటీఫిక్ రివల్యూషన్ లో జరిగిన 80 శాతం ఇన్నోవేషన్స్ , Glasgow, Copenhagen, Krakow, Naples, Marseille and Plymouth లతో చుట్టుకొని ఉన్న ఒక చిన్న hexagon ఆకారంలో ఉండే ప్రాంతంలో జరిగాయి. ఇవే కాదు, దాదాపు మిగతావన్నీ కూడా వీటికి వంద మైళ్ల చుట్టూ ఉన్న ప్రాంతంలోనే జరిగాయి.

దీనికి పూర్తి వ్యతిరేకంగా, ఈ కాలంలో Ottoman ప్రపంచంలో సైంటిఫిక్ ప్రొగ్రెస్ ఏమాత్రమూ కనపడదు. ముస్లిం ప్రపంచం మీద మతానికున్న పట్టు, సైన్స్ లో ప్రగతికి విరోధంగా మిగిలిందనేది చరిత్ర చూస్తే అర్ధమవుతుంది. పదకొండవ శతాబ్దపు తొలినాళ్ళనుంచే ఇస్లామిక్ క్లరిక్స్ గ్రీక్ ఫిలాసఫీ భోధనలు, ఖురాన్ భోధనలతో సరిపడవని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. భగవంతుని సృష్టినీ, విశ్వాన్ని నడిపించే శక్తులనీ అర్ధం చేసుకోవాలని ప్రయత్నించటం Blasphemy గా పరిగణించబడేది. Abu Hamid al-Ghazali రచించిన The Incoherence of the Philosophers లో ఈ foreign science ని చదువుకున్నవాళ్ళు, మతాన్ని వదిలేయకుండా ఉండడమనేది అరుదని ప్రమాదహెచ్చరికలు చేస్తాడు. మతాధికారుల పర్యవేక్షణలో ఫిలాసఫీ ప్రాచుర్యం కాకుండా అడ్డుకోవడమూ, పుస్తకాలని తగలపెట్టటమూ, free-thinkers ని అంతమొందించటమూ నిరాటంకంగా సాగిపోయాయి. యూరోపియన్ యూనివర్సిటిస్, తమ విద్యార్ధుల సంఖ్యని పెంచుకోని, విద్యార్ధులకి స్కాలర్ షిప్స్ పెంచే కాలంలో, ముస్లిం ప్రపంచంలో మద్రాస ల పలుకుబడి పెరిగింది. చివరకి ప్రింటింగ్ ని కూడా అరికట్టాలని చూసారు.

Ottomans కి Script పవిత్రమైనది. పెన్ కీ, కాలిగ్రఫీకి, స్కాలర్ ఇంక్ కీ ఇచ్చినంత ప్రాముఖ్యత ప్రింటింగ్ కి ఇవ్వలేదు. 1515 లో Sultan Selim ప్రింటింగ్ ప్రెస్ ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు కనపడితే వారికి మరణశిక్ష విధించబడుతుందన్న ఆదేశాలని జారీచేసాడు!!. ఒకప్పుడు యూరోపియన్ స్కాలర్స్ కి  ఐడియాస్ నీ, ఇన్స్పిరేషన్ నీ అందించిన ముస్లిం సైంటిస్ట్ లు, సైంటిఫిక్ రంగంలో జరుగుతున్న విప్లవాత్మకమైన మార్పులు తెలుసుకోలేకుండా, వాటినుంచి దూరం చేయబడ్డారు. 

ఇస్లాం ని, సైంటిఫిక్ ప్రొగ్రెస్ తో అనుసంధానం చేయకపోవడం ఒక చారిత్రకవిషాదంగా పరిణమించింది.

పద్దెనిమిదవ శతాబ్దపు చివరివరకీ, కేవలం ఒకే ఒక్క వెస్టర్న్ బుక్ మిడిల్ ఈస్టర్న్ లాంగ్వేజ్ లోకి తర్జుమా చేయబడిందంటే, మిడిల్ ఈస్టర్న్ ప్రపంచం మిగతా ప్రపంచంతో ఎంతగా డిస్కనెక్ట్ అయి ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ఇంతకీ ఆ పుస్తకం ఏంటని మీకు కుతూహలంగా ఉందా? సమాధానం: సిఫిలిస్ ని ఎలా ట్రీట్ చేయాలన్న మెడికల్ బుక్.

Takiyuddin observatory - an artist imagination
ఈ కాలంలో రెండు నాగరికతల్లో ఉన్న తేడాని, 1570 లో Istanbul లో నిర్మించిన obseravtory కథ చెప్పినంతగా మరేది చెప్పలేదు. Takiyuddin al-Rasid, సిరియా లో 1521 లో జన్మించాడు. డమస్కస్, కైరో లలో చదువుకున్న శాస్త్రవేత్త. ఆస్ట్రానమీ, మేథమేటిక్స్, ఆప్టిక్స్ లలో ఎంతో కృషి చేసాడు. తను స్వయానా astronomical clocks నిర్మించినవాడు. 1570 లో తను సుల్తాన్ తో ఎంతో లాబీయింగ్ చేసి అబ్జర్వేటరీ నిరించగలిగాడు. కానీ, 1577 వచ్చేప్పటికల్లా పరిస్థితులు మారాయి. Takiyuddin ఆకాశానికవతల అనంతలోకాల్లో ఉన్న రహస్యాలని ఛేధించటం, దైవదూషణతో సమానమని సీనియర్ క్లరిక్ Sheikh ul-Islam Kadizade, సుల్తాన్ ని ఒప్పించగలిగాడు. ఫలితంగా సుల్తాన్ 1580 లో observatory ని సమూలంగా కూలగొట్టించేస్తాడు. ఆ తరవాత దాదాపు మూడు వందల సంవత్సరాల పాటు ఇస్తాన్ బుల్ ఏ అబ్జర్వేటరీకి నోచుకోదు.

సైన్స్ మీదా, పరిశోధనా, అన్వేషణా, శాస్త్రీయ తృష్ణ మీద క్రిస్టియన్ చర్చ్ తన పట్టుని క్రమక్రమంగా సడలించిన కాలంలోనే, పై రకమైన విధానాలతో, చర్యలతో ముస్లిం మతాధిపతులు Ottoman సైంటిఫిక్ అభివృద్దిని అడ్డుకుంటారు.

పంతొమ్మిదివ శతాబ్ధపు చివరలో కూడా Huseyin Rifki Tamani, the head teacher of Muhendishane-i Cedide "విశ్వం గోళాకారంలోనూ, భూమి దాని కేంద్రంలోనూ, సూర్యచంద్రులు భూమి చుట్టూ తిరుగుతారని బోధించేవారంటే, సైన్స్ నీ, అది కనుక్కొన్న ఫలితాలని గుర్తించటానికి ఎంతగా నిరాకరించారో అర్ధం చేసుకోవచ్చు.


దీనికి పూర్తి వ్యతిరేకంగా పదిహేడవ శతాబ్ధపు ద్వితీయార్ధంలో యూరప్ లో ఉన్న రాజ్యాధికారులందరూ, క్రిస్టియన్ మత పెద్దల నసుగుళ్ళని పక్కకుతోసి సైన్స్ కి పెద్దపీట వేసారు.

Greenwich Royal Observatory
July 1662 లో King Charles II, Royal Society of London for Improving Natural Knowledge కి Physico-Mathematical Experimental Learning సంస్థ స్థాపించటం కోసం నగదు మంజూరు చేసాడు. ఆ తరవాత నాలుగు సంవత్సరాలకి పారిస్ లో Academie Royale des Sciences ఏర్పాటు చేయబడింది. 1675 లో Charles-II Greenwich లో Royal Observatory ని నిర్మించమని ఆదేశిస్తాడు. Royal Society ని ఏర్పాటు చేయడంలో ముఖ్యోద్దేశం ఏ రాజకీర్తికోసం ప్రాకులాటో కాదు, నూతన ఆలోచనలనీ, ఐడియాలనీ, సంక్లిష్టమయిన సైంటిఫిక్ సమస్యలని కలసికట్టుగా ఎదుర్కోవాలన్న సదుద్దేశం. దానికి ఉదాహరణే, గురుత్వాకర్షణశక్తి ప్రిన్సిపుల్. తన ముందు Hooke కృషి ఫలితాలు లేనట్లయితే న్యూటన్ గురుత్వాకర్షణశక్తిని సమీకరించలేకపోయేవాడు.

ఇదంతా చెప్పటం, యూరప్ లో సైంటిస్టులంతా సౌహార్ద్రసంబంధాలని కలిగిఉన్నారన్న అభిప్రాయాన్ని కలిగించటం కోసం కాదు. నిజానికి సైంటిస్టుల మధ్య ఆనాడైనా, ఏనాడైనా పోటీ ఉధృతమే. ఉదా: Inverse-square law of gravity ని ముందు ఎవరు కనుక్కొన్నారన్న విషయం పై Newton, Hooke హోరాహోరీ దెబ్బలాడుకునేవారు. అలాగే Leibniz తన gravity principle ని తీసిపారేసాడన్న కోపంతో Newton, Leibniz తో కూడా హేయమైన పోట్లాటకి దిగేవాడు

ఏదేమైనా experimental methods, patient observation టెక్నాలజీ లో ఎంతో ముందడుగు వేయడానికి తోడ్పడి, చివరకి ఇండస్ట్రియల్ రివల్యూషన్ కి దారి తీసాయి. న్యూటన్ నియమాల మొదలు, థామస్ న్యుకోమెన్ స్టీమ్ ఇంజన్ వరకి ప్రయాణం అతితక్కువ కాలంలో, ఏ మూలమలుపుల చుట్టూ సాగకుండా నేరుగా నడచింది. ప్రపంచంలో ఎంతో ముఖ్యమైన ఇన్నొవేషన్స్, జేమ్స్ వాట్ అధునాతన స్టీమ్ ఇంజన్(1764), జాన్ హారిసన్ క్రోనోమీటర్(1761), రిచర్డ్ ఆర్క్రైట్ వాటర్ ఫ్రేమ్(1769) ఒకే దేశంలోంచి, ఒకే దశాబ్దం లో రావటం కాకతాళీయమేమీ కాదు.

Newton Monument in Westminster Abbey
న్యూటన్ 1727 లో చనిపోయినప్పుడు లండన్ లోని ప్రముఖ చర్చ్ Westminster Abbey లో నాలుగురోజుల పాటు ప్రజల సందర్శనార్ధం ఉంచి, అందులోనే burie చేస్తారు.  తన అంత్యక్రియలకి ఇద్దరు డ్యూక్స్ తో పాటూ, లార్డ్ చాన్సలర్ సైతం హాజరయ్యారు. ఫ్రెంచ్ తత్వవేత్త వోల్టేర్, సమాజపు పైతరగతుల్లోంచి రాని ఒక శాస్త్రవేత్తకి అంతటి గౌరవాన్నివ్వడం చూసి అచ్చెరువొంది "ఒక మేథమేటిక్స్ ప్రొఫెసర్, కేవలం తన వృత్తిలో గొప్పవాడిగా రాణించినందువల్ల, తన మృతికి ఒక రాజమరణపు గౌరవార్దాన్నందివ్వడం నేనీరోజు తిలకించానని" రాసుకున్నాడు. 

Westminster Abbey లోని న్యూటన్ మాన్యుమెంట్ కింద రాసిన ఈ మాటలు న్యూటన్ కి ఇచ్చిన విలువకి అద్దం పడతాయి. "Here is buried Isaac Newton, Knight, who by a strength of mind almost divine, and mathematical principles peculiarly his own, explored the course and figures of the planets, the paths of comets, the tides of the sea, the dissimilarities in rays of light, and, what no other scholar has previously imagined, the properties of the colours thus produced. Diligent, sagacious and faithful, in his expositions of nature, antiquity and the holy Scriptures, he vindicated by his philosophy the majesty of God mighty and good, and expressed the simplicity of the Gospel in his manners. Mortals rejoice that there has existed such and so great an ornament of the human race! He was born on 25th December 1642, and died on 20th March 1726".

వెస్ట్ లో గవర్నమెంట్, సైన్స్ పార్టనర్షిప్ లోకి ప్రవేశించాయన్న విషయం ఇలాంటి ఎన్నో ఉదాహరణల్లో చూడవచ్చు. ఈ భాగస్వామ్యాన్ని చాటి చెప్పే ఇంకో అతి గొప్ప ఉదాహరణ వోల్టేర్ స్నేహితుడయిన King of Prussia 'Frederick the great' ది. అది ఈ కింది భాగంలో చూద్దాం.

***

OSMAN AND FRITZ

ఈ భాగం లో రచయిత Ottoman Empire వియన్నాని ముట్టడించిన తర్వాత 70 సంవత్సరాలకి ఉన్న పరిస్థితులని వివరిస్తాడు.Ottomoan Empire ఎలా వరస సమస్యలబారిన పడిందీ, పన్నులరాబడి తగ్గిపోయి ప్రభుత్వ ఖజానా నిండకపోవటమూ, సుఫీ మిస్టిక్స్ కీ, అతివాదమతపెద్దలకీ మధ్య ఘర్షణలూ, అవినీతిపెరిగిపోవటమూ, అంతర్గత తిరుగుబాట్లతో ఐదుగురు సుల్తాన్ లని పీఠం నుంచి తప్పించటమూ, ఇద్దరు సుల్తాన్ లని హత్యచేయటమూ, బహుభార్యత్వం వల్ల వారసులెక్కువయి రాజ్యాసనం కోసం కుట్రలూ, కుతంత్రాలూ ఇత్యాది సమస్యలతో Ottoman Empire ఎలా వీగిపోయిందో ఈ సెక్షన్ లో గమనించవచ్చు.


Frederick the great, a music lover loved philosophical discussions with Voltaire and others

ఇదే కాలంలో Prussia లో Frederick the Great ప్రష్యాని సమూలంగా మార్చేసి, ప్రజల సమస్యలకి ప్రముఖ పాత్రనిచ్చిన విధానమూ, ప్రభుత్వసిబ్బందిని తగ్గించిన విధానమూ, తన తండ్రిబాటలో కాక హిస్టరీ, మ్యూజిక్, ఫిలాసఫీ(వోల్టేర్ తనకి దగ్గరిమిత్రుడు) లలో తనకున్న ఆసక్తీ గురించీ, రాజసింహాసనం మీద కూర్చున్నాక ఆయన మిలటరీ రంగంలో సాధించిన అద్వితీయమైన ప్రగతీ, విజయాలూ, ఆస్ట్రియానీ ముట్టడించి, సిలిసియాని జయించటం గురించీ, అతను మరణించే సమయానికి తన రాజ్యాన్ని పోలిష్ సరిహద్దులవరకీ విస్తరించటం గురించీ వివరిస్తాడు. 

Frederick తండ్రి రాజాస్థాననానికి ఎంతో రాబడి తెచ్చి, ఎన్నో ఆస్థులని సమకూరుస్తాడు. కానీ Frederick ఆ ఆస్థులన్నిటినీ తిరిగి ప్రజల కోసం ఖర్చుపెడతాడు. ఒపేరా హౌసెస్, కేథడ్రల్స్ ని ఎన్నిటినో నిర్మిస్తాడు. ఎన్నో ఉదారవాద రాజశాసనాలని ఆదేశిస్తాడు. ఆ రోజుల్లో Frederick జారీ చేసిన శాసనాల్లోని మతసామరస్యం, ఇమ్మిగ్రేషన్ పట్ల సుముఖతా, పాత్రికేయస్వేచ్చా గురించీ కూడా మనం ఈ సెక్షన్ లో గమనించవచ్చు. స్వేచ్చా, విదేశసందర్శకులతో ప్రష్యా సంస్కృతి ఇనుమడించిన విధానమూ, ప్రష్యా జ్ణాన తృష్ణా, ఎన్నో పుస్తకాల విక్రయకేంద్రాలూ, చర్చావేదికలూ, సైంటిఫిక్ సంస్థలతో వర్ధిల్లిన విధానమూ గురించి ఈ భాగం లో చదువుకోవచ్చు.

ఈయన పరిపాలనాకాలంలోనే ఫిలసాఫర్ Immanuel Kant (Critique of Pure Reason (1781)) పద్దెనిమదవ శతాబ్దపు అతిగొప్ప ఫిలాసఫర్ గా ఎదిగిన విధానమూ, Frederick the great ఇలాంటి ఫిలాసఫర్స్ కీ, మేధావుల తెలివితేటలకీ ఇచ్చిన ప్రాముఖ్యతా, అదే సమయంలో ఆ మేధావులు ఏ సమాజపు దిగువ వర్గాల నుంచి వచ్చారా, ఎగువతరగతికి చెందినవారా ఇట్లాంటి విషయాల పట్ల తనకున్న విముఖతను గురించీ వివరిస్తాడు.

ఇదే కాలంలో యూరప్ అంతా ఫిలాసఫీ విస్తరించిన విధానమూ, అదే సమయంలో ప్రింటింగ్ ప్రెస్ వల్ల పెరిగిన పుస్తకాలూ, మాగజైన్సూ, విప్లవాత్మకంగా పెరిగిన అక్షరాస్యతా, తద్వారా పెరిగిన చదువరుల సంఖ్య గురించి చెపుతాడు.. జ్ణానం కేవలం చదవడం వల్లే విస్తరించలేదనీ,. ఖండమంతా విస్తరించిన ఆర్ట్ ఎక్జిబిషన్లూ, మ్యూజిక్ థియేటర్సూ వల్ల సోషల్ సైన్సెస్ ప్రజలకి అందిన విధానమూ తద్వారా జరిగిన ఎడ్యుకేషన్ గురించి కూడా చదువుకోవచ్చు.

ఈ పీరియడ్ లో Reason కి ఇచ్చిన ఇంపార్టెన్స్ వల్ల ఎన్ని ముఖ్యమైన ఫిలాసఫికల్, సైంటిఫిక్ గ్రంధాలొచ్చాయో, క్రిస్టియన్ మతచాందసత్వం మీద Reason దాడిని గమనించవచ్చు.ఇతర యూరప్ మోనార్క్ ల వలె, Frederick the great మతం నుంచీ, సమాజంలో ఇతర వర్గాల సంకెళ్ళ నుంచీ, ఇంటలెక్చువల్స్ కి స్వేచ్చనిచ్చాడనీ, వోల్టేర్ కి తన ఇంటిపైన ఆశ్రయాన్నివ్వటమే కాదు, Royal Science Society లాంటిదాన్ని ప్రష్యాలో కూడా ఒకటి స్థాపించమని ఆహ్వానించాడనీ కూడా ఈ భాగంలో రచయిత చెపుతాడు.  ఇదే సెక్షన్ లో Frederick కి మ్యూజిక్ రచనల గురించీ, ఇతర రచనల గురించీ ఉన్న ఆసక్తి గురించి తెలుసుకోవచ్చు. అలాగే ప్రష్యాలోని Potsdam ఈరోజున ఉన్న స్థితి గురించి కూడా రచయిత వివరిస్తాడు.


సైన్స్ లో సాధించిన ప్రగతి, ఆయుధసాంకేతికతలో ఎలా ముందడుగులు వేపించిందీ, తద్వారా మిలటరీ ఆధిపత్యం ఎలా సిద్దించిందీ, గన్స్, ఆర్టిలరీ సాంకేతికత ఎలా అభివృద్ది చెందిందీ ఇవన్నీ కూడా వివరిస్తాడు.

TANZIMAT TOURS

ఈ భాగం లో ముస్లిం ప్రపంచం యూరప్ లో జరుగుతున్న సైన్స్ రివల్యూషన్ నీ తద్వారా యూరప్ యుద్దరంగంలో సంపాదించిన ఆధిక్యతనీ గమనించి, తమముందు మరే మార్గమూ లేదనీ, సైన్స్ ని దగ్గరకి తీసుకోకతప్పదన్న సత్యాన్ని గ్రహించడం గురించి కొన్ని ఉదాహరణలు చూపుతాడు. వెస్టర్న్ ప్రపంచం నుంచి శాస్త్రవేత్తలనీ, నిపుణులనీ ఇస్తాన్బుల్ కి ఆహ్వనించిన సందర్భాలూ, మార్పు కోసం చేసిన ప్రయత్నాలు పొలిటికల్ వ్యతిరేకత వల్ల మాటిమాటికి విఫలం చెందిన వైనాల గురించి కూడా చెపుతాడు. 

Abdulmecid-I
చిట్టచివరకి 1826 లో సంస్కరణలని పెద్ద ఎత్తున చేపట్టిన సుల్తాన్లు గా పేరొందిన Mahmud II మరియు Abdulmecid-I లు మార్పుని వ్యతిరేకిస్తున్న పొలిటికల్ శక్తుల మీద యుద్దాన్ని ప్రకటించి, ఆర్మీని శక్తివంతం చేయటానికి సమూలమైన మార్పులు చేపట్టటం గురించీ, కొత్త ఆయుధాలని సమకూర్చుకోవటం, అల్లాపేరున మోగే యుద్దభేరి ఆర్మీ బాండ్ ని యూరోపియన్ స్టైల్ బాండ్ కింద మార్చటం, చివరకి ఆర్మీ యూనిఫామ్స్ కూడా యూరోపియనైజ్ చేయటం గురించీ రచయిత వివరిస్తారు.

యూరప్ లో వచ్చిన సైంటిఫిక్ విప్లవం తర్వాత 200 సంవత్సరాలకి వెస్టర్న్ నాలెడ్జ్ ని ఇస్లామిక్ ప్రపంచంలోకి తీసుకురావటానికి చేసిన ప్రయత్నాలూ, ఏర్పరిచిన సంస్థల గురించి కూడా రచయిత వివరిస్తారు.

 

ISTANBUL TO JERUSALEM

ఈ సెక్షన్ లో టర్కీ తన విధానాలని మార్చుకోన్న వైనం గురించి వివరిస్తారు. టర్కీ అరబిక్ స్క్రిప్ట్ నుంచి, తన ఆల్ఫబెట్స్ కి మారిన విధానం గురించీ, తద్వారా టర్కీ ఇరవైయ్యవ శతాబ్ధంలోకి దూసుకొచ్చిన విధానమూ, fez నీ, turban నీ వదిలేసి స్త్రీ పురుషులు ధరించే దుస్తుల్లో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులూ , వెస్టర్న్ కాలండర్ ని అమలుపరచడమూ, అన్నిటికన్నా ముఖ్యంగా టర్కీ దేశాన్ని మతపరమైన దేశంగా కాక, సెక్యులర్ దేశంగా ప్రకటించటమూ, షరియా లా ని నిర్మూలించి స్విట్జర్లాండ్ చట్టాన్ని అనుసరించి సివిల్ కోడ్ ని ప్రిపేర్ చేసుకోవటమూ, మతాధిపత్యం ఒట్టోమాన్ ఎంపైర్ ని ఎంత వెనకంజవేసిందో టర్కీ గ్రహించిన సంగతి గురించి చెపుతారు.


అలాగే, ఇజ్రాయిల్ సైంటిఫిక్, టెక్నాలజీ రంగంలో తన చుట్టూ ఉన్న అరబిక్ దేశాలకన్నా ఎంత ముందున్న విషయం గురించి కొన్ని ఉదాహరణలు పేర్కొంటారు.

*************************
చివరగా, ఇస్లాం దేశాలు కూడా ఆధునిక కాలంలో సైన్స్ కి ఆహ్వానం పలికి, తమ తమ దేశాల్లో క్రమక్రమంగా సైంటిఫిక్ సంస్థలనీ, అత్యాధునిక యూనివర్సిటీలనీ, పరిశోధనశాలల మీదా దృష్టి కేంద్రీకరించడాన్నీ గమనించొచ్చు.

ఇస్లామిక్ రిపబ్లిక్ అయిన ఇరాన్ ప్రతి ఏటా రెండు సైన్స్ ఫెస్టివల్స్ ని నిర్వహిస్తుంది. ఇరాన్ ప్రభుత్వం పద్దెనిమిది మిలియన్ల డాలర్లతో అబ్జర్వేటరీని నిర్మిస్తోంది. గమ్మత్తేమిటంటే, షరియా లా ని ఎంతో ఖశ్చితంగా అమలుపరచాలని ఆరాటపడే శక్తులున్న దేశంలో 70 శాతం సైన్స్, ఇంజనీరింగ్ విద్యార్థులు అమ్మాయిలు కావడం ఎంతో సంతోషించాల్సిన విషయం. అటు టెహరాన్ నుంచీ రియాద్ వరకీ, ఇటు సౌదీ నుంచి వెస్ట్ లండన్ వరకీ అమ్మాయిల చదువు పట్ల విముఖత గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఇది ఎంతో ఆహ్వానించదగ్గ విషయం.

అయితే ఇరాన్ సమకూర్చుకూంటోన్న శాస్త్రీయ విజ్ణానం, ఏ ఫలితాలకోసం ఉపయోగిస్తుందో వేచి చూడాల్సిందే. మతశక్తుల చేతిలో విస్ఫోటనవిజ్ణానం ఆందోళనకి ఆస్కారమిచ్చే విషయమే. ఈ విషయంలో పాకిస్తాన్ సైంటిస్ట్ AQKhan  ఎంత భాధ్యతారహితంగా ప్రవర్తించారో గుర్తుకురాకమానదు.

ఈరోజు, వియన్నా ముట్టడి తర్వాత దాదాపు మూడు వందల సంవత్సరాలకి, వెస్ట్ సైంటిఫిక్ రంగంలో మిగతా ప్రపంచం కన్నా ముందంజని ఇకముందు కూడా కొనసాగించగలదా, లేదా?

ఇదే ప్రశ్నని ఇంకోవిధంగా కూడా వేసుకోవచ్చు.

నాన్ వెస్టర్న్ ప్రపంచం, వెస్టర్న్ ప్రపంచపు కేంద్రస్థంభాలయిన Rule of Law, Property Rights, True representative form of government ని తిరస్కరించి, కేవలం వెస్టర్న్ సైంటిఫిక్ నాలెడ్జ్ ని మాత్రమే తీసుకోని ఆ లాభాలని విస్తృతంగా అమలుపర్చి, ప్రపంచాధిపత్యాన్ని సాధించగలదా?

అది తరవాతి చాప్టర్స్ లో చూద్దాం.
**********************************************************************



*1530 to 1789 మధ్య అతి ముఖ్యమయిన break-throughs.

1530 Paracelsus pioneers the application of chemistry to physiology and pathology

1543 Nicolaus Copernicus' De revolutionibus orbium coelestium states the heliocentric theory of the solar system
Andreas Vesalius' De humani corporis fabrica supplants Galen's anatomical textbook

1546 Agricola's De natura fossilium classifies minerals and introduces the term 'fossil'

1572 Tycho Brahe records the first European observation of a supernova

1589 Galileo's tests of falling bodies revolutionize the experimental method

1600 William Gilbert's De magnete, magnetisque coporibus describes the magnetic properties of the earth and electricity

1604 Galileo discovers that a free-falling body increases its distance as the square of the time

1608 Hans Lippershey and Zacharias Janses independently invent the telescope


1609 Galileo conducts the first telescopic observations of the night sky

1610 Galileo discovers four of Jupiter's moons and infers that the earth is not at the centre of the universe

1614 John Napier's Mirifici logarithmorum canonis descriptio introduces logarithms

1628 William Harvey writes Exercitatio anatomica de motu cordis et sanguinis in animalibus, accurately describing the circulatino of blood

1637 Rene Descartes 'La Geometrie' an appendix to his Discours de la methode, founds analytic geometry

1638 Galileo's Discorsi e dimonstrazioni matematiche founds modern mechanics

1640 Pierre de Fermat founds number theory

1654 Fermat and Blaise Pascal found probability theory

1661 Robert Boyle's Skeptical Chymist defines elements and chemical analysis

1662 Boyle states Boyle's Law that the volume occupied by a fixed mass of gas in a container is inversely proportional to the pressure it exerts

1669 Issac Newton's De analysi per qequationes numero terminorum infinitas presents the first systematic account of the calculus, independently developed by Gottfried Leibniz

1676 Antoni van Leeuwenhoek discovers micro-organisms

1687 Newton's Philosophiae naturalis principia mathematica states the law of universal gravitation and the laws of motion

1735 Carolus Linnaeus' Systema naturae introduces systematic classification of genera and species of organisms

1738 Daniel Bernoulli's Hydrodynamica states Bernoulli's Principle and founds the mathematical study of fluid flow and kinetic theory of gases

1746 Jean-Etienne Guettard prepares the first true geological maps

1755 Joseph Black identifies carbon dioxide

1775 Antoine Lavoisier accurately describes combustion

1785 James Hutton's 'Concerning the System of the Earth ' states the uniformitarian  view of the earth's development

1789 Lavoisier's Traite elementarie de chimie states the law of conservation of matter

Tuesday, 16 April 2013

దీనికి ముందు పోస్టులో ఈ పుస్తకం లో ఉన్న ఇంట్రడక్షన్ గురించి రాయడం జరిగింది. ఈ పోస్టులో రచయిత ప్రతిపాదించిన ఆరు కారణాల్లోని మొదటి కారణమైన Competition చాప్టర్ కాపీ కొట్టడమైనది.

రెండు నదులు
  • మింగ్ సామ్రాజ్యపు చక్రవర్తి గ్రాండ్ కెనాల్ ని పునరిద్దరించాక,  ఈ కాలవ మీద 12,000 ధాన్యపు నౌకలు రవాణా అయ్యేవి. వీటి సంరక్షణకి సుమారుగా 50,000 ఉద్యోగులతో ఈ పరిశ్రమ కళకళలాడుతూ ఉండేది.
  • 1420 లో ఐదు నుంచి పది లక్షల జనాభాతో Nanjing ప్రపంచంలోనే అతి పెద్ద నగరాల్లో ఒకటి. సిల్క్, కాటన్ వ్యాపారాలకి కేంద్రంగా, విద్యా, విషయసేకరణల్లో ముందున్న నగరం. 2000 scholars తో 11,000 volumes తో అతిపెద్ద encyclopedia ని ఆ కాలంలోనే చైనీస్ రూపొందించగలిగారు.
  • చైనా మింగ్ చక్రవర్తులు Nanjing తో సరిపెట్టుకోలేదు. Yongle పదవిలోకి వచ్చిన అతికొద్దికాలంలోనే కొత్త రాజధాని బీజింగ్ నిర్మాణానికి భారీ సన్నాహాలు మొదలయ్యాయి. 1420 కల్లా ముగిసిన Forbidden City నిర్మాణంతో చైనా civilized world లో శిఖరాగ్రస్థాయికి చేరుకుందని చెప్పొచ్చు.
  • Yangzi నదిని చూసిన కళ్లతో , ఇదే సమయంలో London లోని థేమ్స్ నదిని చూస్తే, అదొక backwaters గా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఆ సమయంలో London యూరప్ ఖండంలో రద్దీగా ఉండే పోర్ట్ అయ్యి ఉండొచ్చేమో కానీ వ్యాపార లావాదేవీల్లో, వాటి పరిమాణంలో చైనాలోని గ్రాండ్ కెనాల్ తో పోల్చతగ్గదిగా ఉండేది కాదు. ప్రధానంగా ఉన్ని ఎగుమతులకీ, ఫ్రాన్స్ తో నిరంతరంగా జరిగే యుద్దానికీ, మనుషుల సరఫరాకీ ఈ పోర్టు ఉపయోగపడేది.
  • ఇక లండన్ టవర్ ని Forbidden City తో అసలే పోల్చి చూడలేం. Nanjing నగరం, London నగరం కన్నా ఎంతో పెద్దది.
  •  1540 కీ, 1800 కీ మధ్య ఇంగ్లాండ్ లో సగటు ఆయుపరిమితి 37 సంవత్సరాలు మాత్రమే. షుమారు ప్రతి ఐదు శిశువుల్లో, ఒక శిశువు మొదటి సంవత్సరం ముగిసేలోగానే మరణించేవారు. సాక్షాత్తూ Henry V ఇరవైఆరు సంవత్సరాలకి రాజయ్యి, ముప్పైఐదు సంవత్సరాలకల్ల మరణించాడు.
  • France తో ఎప్పటికీ అంతమవ్వని యుద్దం, మధ్యలో Welsh, Scots, Irish లతో యుద్దాలూ, అవీ లేదంటే కిరీటం కోసం అంతర్గత యుద్దాలతో ఇంగ్లాండ్ దేశం లో హింస ఎప్పుడూ రాజ్యమేలుతుండేది.
  • Black Death యూరప్ ని ఊడ్చిపెట్టిన విధానం మానవచరిత్రలోనే ఒక అతిదయనీయమైన ఘట్టం. 1655 లో సమాజ మానసికపరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలంటే తమ్ముణ్ణీ, చెల్లినీ భర్తనీ, వారి ఐదుగురు పిల్లల్నీ ప్లేగ్ వ్యాధి కబళించేసిన తర్వాత Italian artist Salvator Rosa L'umana fragilita (Human Frality) వేసిన పెయింటింగ్ లో మానవుడెంత నిస్సహాయుడో గమనించడం ద్వారా తెలుసుకోవచ్చు. ఆ పెయింటింగ్ మీద రాసిన నాలుగు చిన్న వ్యాక్యాలు యూరప్ లో, ఆనాటి జీవితాలకి అద్దం పడతాయి.
    Conception is Sin, Birth is Pain, Life is Toil, Death is Inevitable

సాంకేతికాధిపత్యం:
  •  ఏషియాలో వ్యవసాయాధిరత ఉత్పత్తులు యూరప్ లో కన్నా చాలా ఎక్కువగా ఉండేవి.తూర్పు ఏషియాలో ఒక ఎకరం భూమిలో పండే బియ్యం ఒక కుటుంబానికి సంవత్సరం పొడుగునా ఆహారాన్ని సమకూర్చగలిగేది. యూరప్ లో దాదాపు అదే పంట పండించడానికి ఒక ఇరవై ఎకరాలు అవసరమొచ్చేది. బహుశా ఇది కూడా ఒక కారణమేమో తూర్పు ఏషియాలో జనాభా ఎక్కువుండటానికి.
  • మొట్టమొదటి వాటర్ క్లాక్ ఎవరు కనిపెట్టారో బహుశా మనకి తెలియకపొవచ్చేమో, కానీ మెకానికల్ క్లాక్ ని మాత్రం 1086లో Su Song అందించాడు 40 foot tall contraption కట్టడం ద్వారా. అది టైమ్ చెప్పడమే కాదు, సూర్య చంద్రుల గమనాల్ని సైతం తెలియచెప్పేది. షుమారు వంద సంవత్సరాల తర్వాత చర్చ్ ల కోసం నిర్మించిన astronimcal clocks వచ్చేంత వరకీ సాంకేతికంగా దీనికి దరిదాపుల్లో సరితూగగల క్లాక్ యూరప్ లో ఉండేది కాదు.
  • మనందరికీ తెలిసిన విషయమే జర్మనీలో పదిహేనవ శతాబ్ధంలో ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టారని. నిజానికి అంత అధునాతనమైనది కాకపోయినా , మొదటి ప్రింటింగ్ ప్రెస్ చైనీస్ పదకొండవ శతాబ్ధంలోనే నిర్మించగలిగారు. పేపర్ నిర్మాణం కూడా చైనాలోనే తొలిసారిగా జరిగిందన్న సంగతి తెలిసిన విషయమే. అలాగే పేపర్ మనీ,వాల్ పేపర్, టాయిలెట్ పేపర్ లు కూడా.
  • 1311 లో Wang Zhen యొక్క Treatise on Agriculture గ్రంధం లో వ్యవసాయ విప్లవానికి సంబంధించిన యూరప్ కి తెలియని ఎన్నో విషయాలుండేవి
  • Iron ని melt చేయడం కోసం మొట్టమొదటి blast furnace చైనాలో క్రీస్తు పూర్వమే ఉండేది
  • క్రీస్తు శకం మొట్టమొదటి శతాబ్ధానికి చెందిన suspension bridge ఆనవాళ్ళు చైనా Ching-tung లో ఈనాటికీ గమనించవచ్చు.
  • అంతెందుకు. 1788 లో కూడా బ్రిటన్ లో ఇనుము ఉత్పత్తులు, చైనాలో 1078 లో, అంటే ఏడొందల ఏళ్ళ క్రితం ఇనుము ఉత్పత్తులకన్నా తక్కువే.
  • Spinning Wheel నీ, Sil reeling frame ని కనిపెట్టడం ద్వారా Textile Production లో చైనా పదమూడవ శతాబ్ధంలోనే విప్లవాలు సాధించి Italy కి ఎగుమతి చేసింది.గన్ పౌడర్ ని కనుక్కున్నది కూడా చైనానే.
  • ఇంకా ఇతర చైనా పరిశోధనా ఫలితాలు. కెమికల్ పురుగుల మందులు, Fishing reel, అగ్గిపుల్ల,అయస్కాంత దిక్సూచి, పేక ముక్కలు,టూత్ బ్రష్,Wheel Barrow
                                                               భారీ పడవల నిర్మాణం
ఇవన్నీ ఒక ఎత్తయితే. 1400 సంవత్సరం మొదలయ్యేనాటికి చైనా ప్రపంచాధిపత్యాన్ని సంపాదించే అతి ముఖ్యమైన సాంకేతిక విజ్ణానాన్ని సమకూర్చుకుంటోంది. ప్రపంచం కనీ వినీ ఎరుగని రీతిలో, చైనా భారీ ఓడలని నిర్మించడం మొదలుపెట్టింది . సుదూర సముద్రయానాన్ని అతి సులువు చేయడమే కాక, వర్తక వాణిజ్య సామాగ్రి సరఫరా పెంచడమే కాకుండా, ఈ భారీ సైజు నౌకలు చైనా శక్తి,యుక్తులకి ప్రతీకగా ఇతరదేశాలకి చాటిచెప్పేవి.

ఈరోజుకి కూడా Nanjing లో Treasure Ship అసలు సైజు నకలు ని చూడొచ్చు. 400 feet పొడవుతో ఉన్న ఈ పడవ సైజు, Christopher Columbus అట్లాంటిక్ మహాసముద్రాన్ని 1492 లో దాటిన Santa Maria కన్నా ఐదింతలు పెద్దది.




అంతే కాదు, సముద్రం మీద ప్రయాణించడానికి చైనా ఉపయోగించే 300 పెద్ద నౌకల్లో , ఈ Treasure Ship కేవలం ఒక నౌక మాత్రమే.

Zheng He నాయకత్వం లోని నౌకాదళం 28,000 సిబ్బందితో చైనా వర్దిల్లేది. First world war దాకా అంత పెద్ద నౌకాదళం పశ్చిమార్ధం లో ఏ దేశానికి లేదు.

ఈ పడవలనుపయోగించే 1405 - 1424 మధ్యలో Zheng He థాయ్ లాండ్, సుమాత్ర, జావా, ఇండియాలో కాలికట్(కేరళ) , సింగపూర్, సిలోన్, కటక్(ఒరిస్సా) నుంచీ, జెడ్డా దాకా నౌకాయానం ద్వారా ప్రయాణించాడు.

ఈ నౌకా యాత్రల్లో Zheng He మరియు అతని సిబ్బందీ Porcelain, iron cauldrons, gifts, oil, wax etc ఇతరదేశాల్లొంచి కొనుగోలు చేసేవారు. అలాగే ఇండియన్ వ్యాపారులు అమ్మే porcelain, silk and musk, peppers, pearls, precious stones, ivory and rhinoceros horns ఇవన్నీ కూడా కొనుగోలు చేసేవారు.

వాణిజ్యం, కొనుగోళ్ళూ, కప్పం తో పాటుగా ఈ నౌకాయాణాల ద్వారా చైనా శక్తిని ప్రదర్శించి, వివిధ బహుమానలివ్వటం ద్వారా బార్బేరియన్ దేశాల భయభక్తులని సాధించాలని ఆరాటపడటంతో పాటుగా, ఆఫ్రికా దేశాల పరిపాలకులకీ, చైనాకి మధ్య సంబంధాల్నినెలకొల్పటం లాంటి ఇతర లక్ష్యాల్ని కూడా చైనా సాధించగలిగింది. (African Malindi(Kenya) Sultan చైనా చక్రవర్తికి ఎన్నో exotic gifts తో పాటుగా ఒక కొత్త యానిమల్ జిరాఫీ ని బహుకరించిన ఘట్టం లో చైనా చక్రవర్తి మాట్లాడుతూ చెప్పిన మాటల్లో రాజ్య, ధన కాంక్షకన్నా, కీర్తి కాంక్ష ఎక్కువ కనపడటం మనం గమనించవచ్చు). 

కాని 1424 వచ్చేప్పటికల్లా Yongle చక్రవర్తి చనిపోవడంతో, పరిస్థితులు తారుమారయ్యి, ఆయనతో పాటే, చైనా ఆశయాలన్నీ చెదిరిపోవటం మొదలయింది. Zheng He నౌకాయాత్రలన్నిటినీ వెనువెంటనే నిలిపివేయటం జరిగింది. పెద్ద నౌకల తయారీని నిషేదించారు. 1500 సంవత్సరం వచ్చేప్పటికల్లా చైనాలో రెండు పెద్ద తెరచాపల కన్నా ఎక్కువున్న పడవని నిర్మించడం, ఉరిశిక్షార్హం, అంటే పరిస్థితులు ఎంత విషమించాయో అర్ధం చేసుకోవచ్చు.

అంత గొప్ప ఓడల్నీ, నౌకల్నీ నిర్మించి, వాటియాత్రల ద్వారా విదేశివాణిజ్యం తో సముద్రాలకవతల విజయకేతనాన్ని ఎగరవేయటానికి సిద్దమయిన చైనాలో , అకస్మాత్తుగా పరిస్థితులన్నీ తారుమారవడానికి కారణాలేమిటి?
  • Yongle చక్రవర్తి చనిపోయిన తరవాత , వచ్చిన ఆర్ధిక సంక్షోభాలా? లేక దేశాధిపత్యం కోసం జరిగిన అంతర్గత రాజకీయ లొసుగులా?
  • వియత్నాం తో జరుగుతున్న యుద్దం వల్ల అదుపుతప్పిపోయి పెరిగిన ఖర్చులా?
  • లేక ఇతర కారణాలా?
బహుశా ఇదమిద్దంగా ఇదీ కారణమని మనకెప్పటికి తెలియకపోవచ్చు. కానీ, ఆ కాలంలో Zheng He ఓడప్రయాణాలు, 1960 ల కాలంలో space race లో అమెరికా తన విజయదుంధుభిని మ్రోగించి, ప్రపంచానికి తన శక్తిని ప్రదర్శించడంతో పోల్చతగినవి అని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి ఉండబోదు.

SPICE RACE.

పైన పేర్కొన్న గొప్ప నావికుడూ, ప్రపంచ చరిత్రలో రాజ్యాధికారశక్తులకి అతిసమీపంగా ఉండడమే కాకుండా అత్యంత పలుకుబడి సాధించిన Eunuch గా పేరొందిన Zheng He, నావికాదళం శక్తులతో పోలిస్తే, పోర్చుగల్ నుంచి ప్రపంచానికి సుపరిచితం కాబోతున్న నావికుడు వాస్కోడిగామా నౌకలు నాలుగురెట్లు చిన్నవి.

  •  వాస్కోడిగామా సిబ్బంది కేవలం 170 మంది మాత్రమే. కానీ, గామా నౌకాయాత్రల లక్ష్యాలు భిన్నమైనవి.

  • Spices కోసం మొదలయిన ఈ నౌకాయాణాలు ప్రపంచాన్ని, పశ్చిమం వైపు మొగ్గు చూపడానికి నాందిగా పేర్కొనవచ్చు.

  • Cinnamon, Cloves, mace and nutmeg యూరప్ లో పండేవి కాకపోవడంతో వాటిని దిగుమతి చేసుకోక తప్పేది కాదు.


అయితే శతాబ్ధాల నుంచీ కూడా ఈ spices అన్ని యూరప్ దాకా రావడానికి స్థిరపడిన దారులు రెండే. హిందూమహాసముద్రం నుంచి Red Sea పైగా ఒక మార్గమయితే, Areabia and Anatolia భూభాగం ద్వారా ఇంకో మార్గం. ఇవి రెండూ కాకుండా, ఆఫ్రికా ఖండం పశ్చిమతీరం వెంట, దాని చుట్టూ ప్రయాణించి, Cape of Good Hope మీదుగా Indian Ocean లో ప్రవేశించగలిగే లాంటి, ఇతర మార్గాలేవైనా అన్వేషించగలిగితే వ్యాపారం అంతా తమదే అవుతుందన్న సంగతి పోర్చుగీస్ అర్ధం చేసుకుంది.




ఇక్కడ ఒక ముఖ్యమైన సంగతి గమనించాలి. King Manuel(Portugese) ఆదేశాలలో పాశ్చాత్య దేశాలు ఇతరఖండాలకి ఎలా వ్యాపించాయో తెలుసుకోవచ్చు. ఆఫ్రికా చుట్టూ తిరిగి మరీ explore చేయడంలో మతలబు చైనా చక్రవర్తి లాగా కేవలం ఇతర దేశాల భయభక్తులనీ, గౌరవాన్నీ, వాణీజ్యాన్నీ, కప్పం నీ సాధించడమొక్కటే కాదు. యూరప్ లో తమ ప్రత్యర్ధులయిన స్పెయిన్, ఇటలీ లాంటి దేశాల కన్నా పొలిటికల్ గా, ఎకనమికల్ గా ముందడుగు వేయడం వాళ్ళ మనుగడకి ఒక అవసరం. గామా కనక కొత్త మార్గాన్వేషణ లో విజయం సాధిస్తే Lisbon, Venice ని మట్టికరపించినట్లే.

14 July 1497 న ప్రయాణం మొదలుపెట్టిన వాస్కోడిగామా, April 1498 లో Malindi ని చేరతాడు. అంటే, Zheng He Malindi మీద అడుగుపెట్టిన ఎనభైరెండు(82) సంవత్సరాల తరవాత!!.

చైనా పెద్దగా ఏం మిగల్చకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయిన Malindi లో వాణిజ్యానికి మంచి కేంద్రం కాగల అవకాశాలు వాస్కోడిగామాకి బాగా కన్పిస్తాయి. ముఖ్యంగా అక్కడ ఉన్న భారతీయ వ్యాపారస్తులని చూట్టం తనలో ఉత్సాహాన్ని నింపుతుంది. బహుశా ఈ భారతీయులే గామాకి భారతదేశ మార్గం చూపడంతో పాటుగా, Calicut కి వెళ్ళడానికి Monsoon Winds ని పరిచయం చేసి ఉంటారు.

ఇక్కడ జరిగిన చరిత్రని చూస్తే చైనీస్ కి, పోర్చుగీస్ కి కనపడేది వ్యాపారావకాశాల ఆత్రుత ఒక్కటే తేడా కాదు అని తెలుసుకోవచ్చు. Zheng He ప్రదర్శించినదానికన్నా, ఎన్నో రెట్ల నిర్ధాక్షిణ్యతా, కరడుగట్టిన క్రూరత్వం పోర్చుగీస్ అమలుపరచిందని అర్ధమవుతుంది .

ఉదాః Calicut రాజు, వాస్కోడిగామా Lisbon నుంచి తెచ్చిన సామాగ్రిని అప్రసన్నంగా చూసినప్పుడు గామా వెంటనే దాడి చేసి పదహారుమంది జాలరులని బంధీలుగా ఉపయోగించుకున్నాడు. అతని రెండవ భారత యాత్రలో పదిహేను ఓడల దళంతో వెళ్ళి Calicut మీద దాడి చేయడమే కాక, తను బంధించిన మనుషుల శరీరాయవలని దారుణంగా గాయపర్చి, ఛిధ్రం చేసాడు. తదుపరి యాత్రల్లో ఒకసారి మెక్కాకి వెళ్తూన్న పడవలో ప్రయాణీకులని లోపలే బంధించి పడవకి నిప్పంటించాడు.

వాస్కోడిగామా నాయకత్వంలో పోర్చుగీస్ నావికాదళం, వారికి ఎదురవబోయే ప్రతిఘటనని అణచివేయటానికి అతిదారుణమైన హింసకి ఒడిగొట్టిందన్నది చారిత్రక సత్యం. దానికి సాక్ష్యం, పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న ఇండియాకి నియమింపబడ్డ రెండవ గవర్నర్ Afonso de Albuquerque తన దేశానికి పంపిన ఒక నివేదిక లో చూడవచ్చు: 
  •  "మన ఆగమన పుకారు వస్తే చాలు, ఇక్కడ ఉన్న పడవలు అన్నీ ఒక్కమాటున మాయమయ్యేవి, చివరికి పక్షులు సైతం నీళ్ళ మీదకి షికారుకి రావడానికి భయపడేవి"
పోర్చుగీస్ సముద్రజైత్రయాత్ర ఇండియా దాటి కొనసాగింది. మధ్య మధ్యలో కొన్ని అపజయాలు చవిచూడకపోలేదు. ఉదా: మొట్టమొదటి నౌకాయాత్రలోనే సగానికి సగం సిబ్బంది ప్రాణాలు కోల్పోయి, కేవలం రెండే నౌకలు Lisbon కి తిరిగిచేరగలగాయి. చివరకి గామా సైతం తన మూడవ ఇండియా ప్రయాణంలో మలేరియా బారినపడి మరణించాడు.
కానీ మిగతా పోర్చుగీస్ అన్వేషకులు ఇండియాని దాటి, చైనా వరకి సముద్రయాత్రలని కొనసాగించారు.

చైనాకి అవసరమైన వాణిజ్య సామాగ్రి ఏదీ పెద్దగా, పోర్చుగీస్ దగ్గర లేకపోయినా, పేపర్ మనీని వదిలించుకొని, కాయిన్ కరెన్సీ వాడకాన్ని పెంచడానికి కృషి చేస్తున్న మింగ్ చైనా కి ఎంతో అవసరమైన వెండిని మాత్రం తీసికెళ్ళగలిగారు.చివరకి 1557 లో చైనాలోని Macau పోర్చుగీస్ స్వాధీనమవుతుంది. 1587 కల్లా ఒక ముఖ్యమయిన వ్యాపారనగరంగా గుర్తింపు చెందుతుంది.

ఎక్కడో Lisbon(Portugese) లో మొదలుపెట్టి, ఆఫ్రికా చుట్టూ, అరేబియా చుట్టూ, ఇండియా చుట్టూ తిరిగి, Malacca నుండి దూసుకెళ్ళి, Spice Lands లో విజయపతాకాల్ని ఎగరవేసుకుంటూ కొనసాగిన జైతయాత్ర, చివరకి Macau ని దాటి ముందుకు కొనసాగుతుంది.

సముద్రాలకావల విస్తరిస్తున్న తమ ప్రత్యర్ధుల విజయాలూ, పొందిన లాభాలూ, ఇతర యూరోపియన్ దేశాల కన్నుదాటిపోలేదు. మొట్టమొదటగా రంగంలోకి దూకిన స్పెయిన్ ఫిలిప్పీన్స్ లో నాటిన జెండాతో ఏషియాలో తన మొదటి స్థావరాన్ని స్థాపించి, ఈ మార్గం గుండా చైనాకి కావలసిన ఎంతో వెండిని రవాణా చేయగలుగుతుంది. 

కానీ పోర్చుగీస్ కనుగొన్న కొత్త Spice route లో ఉన్న సువర్ణావకాశాల్ని స్పెయిన్ వదులుకోదల్చుకోలేదు. కొత్తమార్గం మీద దృష్టి కేంద్రీకరించిన స్పెయిన్1600 మధ్యలో కల్లా కొత్త రవాణామార్గంలో పోర్చుగీస్ ని అధిగమించి, తమ ప్రత్యర్ధి కన్నా అధిక నౌకల్నీ, సామాగ్రినీ రవాణా చేయగలుగుతుంది.

తమ సమీప దేశాల అభివృద్దిని గమనించిన ఫ్రాన్స్ దేశం కూడా బరిలోకి దిగుతుంది.

మరి ఇంగ్లాండ్ ఏం చేస్తుందీ కాలంలో? 

ఎప్పుడూ ఫ్రాన్స్ ని ఆక్రమిద్దామన్న ఆశయమే తప్ప, అంతకుమించి విజయకాంక్ష లేని ఇంగ్లాండ్ దేశం, మధ్యయుగాల్లో ఉన్నిని అమ్ముకోవడం తప్ప అంతకుమించి ఒక నూతనఉపాయాన్ని సాధించలేని ఇంగ్లాండ్ దేశం, తమ తోటి యూరోపియన్ దేశాల విస్తరణనీ, వారి వ్యాపారలాభాల్నీ చూస్తూ ఉండలేకపోయింది.

ఇంకేముంది? 1496 లో John Cabot మొదటిసారిగా అట్లాంటిక్ ని దాటడానికి ప్రయత్నిస్తాడు. 1553లో Hugh Willoughby and Richard Chancellor నార్త్ ఈస్ట్ పైనుంచి ఇండియాకి రావడానికి ప్రయత్నించి, మార్గంలో Willoughby ప్రాణాలు కోల్పోయినప్పటికీ, Richard భూమార్గం ద్వారా ఇండియా దాటి ప్రయాణించి మాస్కో చేరుకుంటాడు.

ఇంగ్లాండ్ కి తిరిగి వచ్చిన Chancellor చేసిన మొట్టమొదటి పని, రష్యాతో వ్యాపార వాణిజ్య నిమిత్తం మొట్టమొదటి
కంపనీని స్థాపిస్తాడు. ఈ రోజున గమ్మత్తుగా కనపడే ఆ కంపెనీ పేరులోనే అప్పటి ఇంగ్లాండ్ ఆశయాలని గమనించొచ్చు . (పేరు: The Mystery and Company of Merchant Adventurers for the Discovery of Regions, Dominions, Islands, and Places unknown). కాలక్రమేణా ఇలాంటి కంపనీలు, సంస్థలు ఇంగ్లాండ్ రాజరికపు తోడ్పాటుతో ఎన్నో తెరమీదకొచ్చి, అట్లాంటిక్ కి ఆవలే కాకుండా, కొత్త Spice Route లో సైతం వ్యాపారాన్ని కొనసాగించాయి.

పదిహేడవ శతాబ్ధపు నడుమకల్లా England వ్యాపారం Belfast నుంచి Boston వరకీ, Bengal నుంచీ Bahamas వరకీ విస్తరించి మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది.

Cut-throat Competetion తో ప్రపంచం కొత్తగా చెక్కబడుతోందన్న విషయం మనకి సుస్పష్టంగా కనపడుతోంది. కాని మన ప్రశ్న మన దగ్గిరే మిగిలి ఉంది. చైనీస్ లో కనపడని వ్యాపార వ్యాణిజ్య ఆరాటం, దుగ్ధా, దూకుడూ యూరోపియన్స్ లో ఎందుకు కనిపించింది?

వాస్కోడిగామా సొమ్ము, సంపాదనల కోసం అంతగా ఎందుకు ప్రాకులాడాడు, చివరకి మనుషుల్ని దారుణంగా హింసకి గురిచేసి చంపేంత పాపానికి ఒడిగట్టాడు?.

దానికి సమాధానం మధ్యయుగాల్లో యూరప్ పటం లో దొరుకుతుంది. వందలకొద్దీ చిన్న చిన్న నగర సంస్థానాలతో, రాజ్యాలతో నిండిపోయిన కాలమది Baltic నుండి Adriatic వరకీ, Lubeck నుండి Venice వరకీ దాదాపు వెయ్యి రాజ్యసంస్థానాలుండేవి పద్నాలుగో శతాబ్ధంలో.  చైనా జాగ్రఫీని పరిశీలిస్తే మూడు నదులు Yellow, Yangzi and Pearl west నుండి east కి వెళ్తూంటాయని అర్ధమవుతుంది. అదే యూరప్ లో ఎన్నో నదులు, ఎన్నో డైరక్షన్స్ లో ప్రవహిస్తూంటాయి. ఇహ Alps నుండీ Pyrenees వరకీ విస్తరించిన పర్వతశ్రేణులూ, Germany Poland ల నిండా ఉన్న అడవులతో నుండి ఉన్న ప్రాంతం కన్నా, గుర్రాలమీద దాడికి వచ్చే Mongols కి విశాలంగా ఉండే చైనా మీద దాడిచేయటం బహుశా సులభమయ్యి ఉంటుంది. దాంతో చైనాకి అవసరమయినంత ఐకమత్యం, యూరప్ లో ఉన్న చిన్నచిన్న రాజ్యాలకి అవసరమయి ఉండకపోవచ్చు. ఈ కారణంగానూ, కలసివచ్చిన ఇతర కారణాలవల్ల కూడానూ విడివిడిగా ఉండిపోయిన యూరప్ దేశాలు చివరకి ఒకదానితో ఒకటి పోటీ పడి తమ ఉనికిని, అభివృద్దినీ కాపాడుకోక తప్పలేదు.

ఇదిలా ఉండగా, యూరప్ లో సముద్రం పైన ఓడల నిర్మాణం చిన్న సైజు లోనే కొనసాగింది.వైరి వర్గాలు గురిచూసి దాడి చేయడానికి అనువుగా ఉండే చైనా నిర్మించిన అతి పెద్ద ఓడలతో పోలిస్తే, వేగానికీ, ఫైర్ పవర్ కీ కీ కూడా సౌలభ్యంగా ఉన్న ఈ ఓడల సైజు, సులభంగా మలుపులు తిరగగలగడమే కాక, శత్రు వర్గాలకి వీటిని గురి చేయటానికి కష్టంగా ఉండేది.

1501 లో ఫ్రెంచ్ ఓడల మీద ఫిరంగుల ని పెట్టి, కాల్చడం సాధించిన తర్వాత, ఈ ఓడలు, సంచార యూరోపియన్స్ యుద్దసేనకి, నీటిమీదతేలేకోటలు గా పరిణమించాయి. ఇహ ఎదురనేదే లేకుండా పోయింది.  

ఈ నిరంతర యుద్దాల కారణంతో యూరప్ రాజ్యాధిపతులు, ప్రజల మీద పన్నుల ద్వారా ప్రభుత్వ ఖజానాకి సరిపడినంత ఆదాయాన్ని సమకూర్చుకోగలిగారు. ఉదా: 1520-1630 మధ్యలో చిన్న దేశాలైన ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశాలు, ఎంతో పెద్ద దేశమైన చైనా కన్నా అధిక ఆదాయాన్ని పన్నుల రూపంలో రాబట్టగలిగారు.

ఇటలీ మరియి ఇతర యూరప్ దేశాలు ఆ కాలంలోనే కనీవినీ ఎరుగని రీతిలో, Modernbond markets నమూనాలో గవర్నమెంట్ బారోయింగ్ ని ప్రవేశ పెట్టాయి. అలనాటి కాలంలో ప్రజల సమూహపు అప్పు (Public Debt) అనేది Ming China కి ఊహకి కూడా అందనిది.

ఇహ ప్రపంచాన్ని మార్చేసిన అత్యంత నూతన ఆర్ధిక ఐడియాని Dutch ప్రవేశపెట్టింది. మొట్టమొదటిసారిగా కంపెనీల్లో షేర్ల ద్వారా పెట్టుబడి దాని లాభాల్నీ, నష్టాల్నీ పంచి పెట్టే ఆలోచనకి మూలాల్ని 1602 లో Dutch స్థాపించిన Dutch East India Company లో చూడొచ్చు.అయితే దీనివల్ల ప్రభుత్వఖజానాకి రాబడి పెరిగింది కానీ, కంపనీల్లోభాగస్వాములు పెరిగేసరికి క్రమక్రమంగా రాజ్యాధికారాలు తగ్గిపోయాయి.

వీటన్నిటినీ మించి తరాల కొద్దీ సాగిన అంతర్గత సంఘర్షణ, ఏ ఒక్క దేశాన్నో,రాజునో ఎదురులేని శక్తిగా మార్చి, యూరప్ అంతటినీ ఏలే అవకాశం లేకుండా చేసింది. చివరకి బయటనుంచి వచ్చిన తుర్కులు తూర్పు యూరప్ మీదకి దండెత్తి వచ్చినప్పుడు కూడా, యూరప్ అంతటినీ కలిపి మాట్లాడే గొంతు లేకుండా పోయింది. మింగ్ చైనా లాగా ఓడల నిర్మాణం ఆపేయమని ఆదేశించడానికీ, సముద్రప్రయాణాలాపేసి మీదకి దూసుకొస్తూన్న శత్రువునాపడానికి మనందరం పోరాడుదాం అని చెప్పడానికి కూడా ఒక కేంద్రీకృత అధికారం లేకుండా పోయింది. పైగా యూరప్ లోని ప్రతి మోనార్క్ కూడా సముద్రాలని దాటి కాలనైజేషన్ నీ, ఆక్రమణలనీ, వాణిజ్య వ్యాపారాలనీ ప్రోత్సహించారే తప్ప , వాటికడ్డుగా ఏనాడూ నిలవలేదు.

యూరప్ లో ఒక వంద సంవత్సరాల పాటు సాగిన Reiligious War కూడా సముద్రాలు దాటి పోయేటందుకు ఒక ప్రేరకమయింది. పై అన్ని కారణాల వల్లా, యూరప్ లో ఎప్పుడూ అధికారం ఒక పీఠం చుట్టూ కేంద్రీకృతమయి స్థిరపడిపోలేదు.
  • అధికారికంగా Henvry V ఇంగ్లాండ్ రాజే అయినా, అసలు అధికారమంతా భూమి యజమానులకీ, కార్పోరేట్ సంస్థలకీ ఉండేది. ఆ కాలంలోనే ఎన్నో నగరాలు స్వీయనిర్ణయాధికారంతో, స్వతంత్ర ప్రతిపత్తితో మసలేవి . ఒక కార్పోరేషన్ గా విస్తార అధికారాలు కలిగిన The City of London Corporation అనేది ఎనిమిదివందల సంవత్సరాల క్రితమే స్థాపించబడింది.
  • 1130 లోనే Henry I రాజు జ్యోక్యాన్ని నిర్మూలిస్తూ లండన్ ప్రజలకి తమ షరీఫ్ ని స్వంతంత్రంగా ఎన్నుకొనే అధికారాన్నిచ్చాడు.
  • 1191 లో Richard I మేయర్ ని నియమించే అధికారాన్ని వదులుకొని , ప్రజల ఎన్నికకే వదిలేసాడు
  • తదుపరి జరిగిన ఎన్నో పరిణామాల్లో లండన్ నగరం రాజు అధికారాన్ని నిరంతరంగా ఎదిరిస్తూ, ఎన్నో హక్కుల్నీ, స్వయం పాలనాధికారాల్ని సమకూర్చుకుంది.

పొలిటికల్ వ్యవస్థల్లోనే కాదు, టెక్నాలజీలో కూడా ఒక దేశాన్ని మించి ఇంకొక దేశం ముందడుగు వేయడంలో కూడా వివిధ దేశాల మధ్యా , వివిధ నగరాల మధ్య ఉన్న పోటీ గణనీయమైన పాత్రని పోషించింది. ఉదా:  a)1330 లో Richard of Wallingford యూరప్ లో అధునాతనమైన మెకానికల్ క్లాక్ ని స్థాపించగలిగిన తరవాత, ఒక నగరం లోని చర్చ్ లో కంటే పక్కనగరం లోని చర్చ్ లో మరింత అధునాతనమైన క్లాక్ ని స్థాపించటం కోసం ప్రయత్నం చేయటం, తద్వారా ఈ క్లాక్స్ సమయాన్ని చూపించటమే కాకుండా చంద్రగమనాన్నీ, వివిధ గ్రహాల గమనాలనీ, సముద్రపు ఆటుపోటులనీ కూడా ఖశ్చితంగా అంచనా వేసేవి. b) ప్రొటెస్టెంట్ వాచ్ మేకర్స్ ని ఫ్రాన్స్ తమ దేశంలోకి అనుమతించకపోతే, స్విట్జర్లాండ్ సంతోషంగా స్వాగతం చెప్పేది. చివరకి పదహారవ శతాబ్దపు చివరకి చైనాలో ఉన్న మెకానికల్ క్లాక్స్ ని తలదన్నే రీతిలో యూరోపియన్స్ క్లాక్స్ తయారయ్యాయి.

ఈ కాలంలో యూరప్ లో జరుగుతున్న నిరంతర మార్పుతో పోలిస్తే, చైనా ఒక స్థబ్ధమైన ప్రదేశం. భారీ పెట్టుబడులేమన్నా జరిగాయీ అంటే ఉత్తరదిశగా ఉన్న శత్రుభయం తగ్గించుకోవటం కోసం జరిగిన చైనా గ్రేట్ వాల్ నిర్మాణం లోనూ, మరియు ఇరిగేషన్ రంగంలో జరిగిన కెనాల్ నెట్ వర్క్స్ నిర్మాణం లో మాత్రమే.

యూరప్ లో అధికారమంతా రాజకిరీటం, చర్చ్, వివిధ నగరాల సంస్థలూ, ప్రభుత్వశాఖలూ పంచుకొన్నాయి. కానీ చైనాలో దిశా నిర్దేశాధికారమూ, రాజనీతి నిర్ణయాధికారాలూ ఒక ఇంపీరియల్ పవర్ అథారిటీలో ఉండిపోయాయి.

THE MEDIOCRE KINGDOM:

నాగరికతలు బహు సంక్లిష్టమైనవి. శతాబ్ధాల పాటు బలంతోనూ, సిరిసంపదలతోనూ వర్ధిల్లుతాయి. అంతే అకస్మాత్తుగా దిశ తప్పి అగమ్యగోచరంగా సాగిపోయి రాలిపోతాయి.


మింగ్ డైనాస్టీ 1368 లో పుట్టుకొచ్చింది. మింగ్ చైనా దాదాపు మూడొందల సంవత్సరాల పాటు ప్రపంచంలోనే అత్యంత నాగరికతా దేశంగా వర్ధిల్లింది. కానీ పదిహేడవ శతాబ్ధపు మధ్యలోకొచ్చేపటికల్లా ఆ రధచక్రాలు ఊడొచ్చేసాయి. పొలిటికల్ వర్గ తగాదాలూ, ఆర్ధిక సంక్షోభాలూ, వెండి కొనుగోలు శక్తి పడిపోవడాలూ, పన్నురాబడి క్షీణించడమూ ఇవన్నీ కలిపి చైనాని ఒక నిస్సత్తువ శక్తిగా మార్చేసాయి. దీనికి తోడు క్షామమూ, పేట్రేగిన వ్యాధులూ కలసి తిరుగుబాటుకి దారి తీసాయి. చిట్టచివరి మింగ్ చక్రవర్తి అవమానంతో ఉరితీసుకోని చనిపోయాడంటే చైనా పతనావస్థని ఊహించుకోవచ్చు. ఒక క్రమపద్దతిలో అధికారాన్ని అంచెలంచెలుగా శిఖరాగ్రం వరకీ నిర్మించి, గొప్ప కన్ఫ్యూషియస్ ఫిలాసఫీని పాలనలోకీ, అధికార ప్రవేశ పరీక్షల్లోకి తీసుకొచ్చిన చైనా, ఏ రూల్సూ, రెగ్యూలేషన్సూ లేకుండా Anarchy లోకి జారిపోవడానికి పదేళ్ళ కన్నా ఎక్కువకాలం పట్టలేదు.


ఏం జరిగింది?

ప్రపంచం మీదనుంచీ, బాహ్యపరిణామాల మీదనుంచి చైనా దృష్టి మళ్ళి లోపలి వైపు శ్రద్దపెట్టింది. బయటనుంచి ఒక బలవంతమైన శక్తిగా కనపడిన చైనా అంతర్గతంగా పెళుసుగా మిగిలిపోయింది. గ్రామాలు ఓ మోస్తరుగా నిలబడగలగాయి కానీ, ఒక జాతిగా మాత్రం చైనా స్థబ్ధంగా మిగిలిపోయింది. ఒక శక్తివంతమైన ఉక్కులాంటి అధికారానికి అలవాటు పడిన ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఏ రకమైన ఇన్నోవేషన్ కీ తావులేకుండా పోయింది. ఓ మోస్తరుగా సాధించిన అభివృద్ది కనీసావసారలకి సరిపోవడంతో పెద్ద లక్ష్యాలమీద నుంచి దృష్టి మరల్చి, క్రమక్రమంగా పెద్దపెద్ద అడుగులు వేసిన బాటలదృశ్యమయ్యి, జాతి మొత్తం చిన్నచిన్న అడుగులకి అలవాటుపడింది.

దీనికి వ్యతిరేకంగా ఇంగ్లాండ్ పదిహేడవ శతాబ్ధపు చివరలో సముద్రాలని జయించి సాధించిన రాజ్యవిస్తరణ ఈ దేశాన్ని, తామున్న వలలోంచి బయటపడేసింది. అట్లాంటిక్ మీదుగా సాగిన వ్యాపారవ్యాణిజ్యాలు కొత్తగా అధిక పోషకాహారవిలువగల పొటాటోస్ నీ, షుగర్ నీ తీసుకొచ్చాయి. ఒక ఎకరంలో పండే షుగర్ కేన్ పంటలో వచ్చే ఎనర్జీ, పన్నెండెకరాల గోధుమపంటలో సైతం వచ్చేది కాదు. పెరుగుతున్న వ్యాపారం, దాంతోపాటే పెరుగుతున్న పోటీ ప్రొడక్టివిటిని పెంచింది, క్రమంగా ఆదాయాన్నీ, పోషకాహార విలువలు గల కొత్త పంటల్నీ సైతం పట్టుకొచ్చింది.

చైనా ఒక్కటే కాదు, అదే కాలంలో జపాన్ ని చూసినా కూడా బాహ్యదృష్టిని మానేసి, కేవలం లోపలివైపు మాత్రమే దృష్టిసారించటం వల్ల అభివృద్ది కుంటుపడిందన్న విషయం గమనించవచ్చు. 1640 లో జపాన్ బయటిదేశాలతొ దాదాపు పూర్తిగా సంబంధాలని తెంచుకోని ఒంటరిదయ్యింది. చైనా, జపాన్ లు విదేశీవ్యాపారానికి విముఖత చూపి , కేవలం రైస్ పంటదిగుబడులని పెంచడం మీద దృష్టి పెట్టాయి.

పరిస్థితులు క్రమంగా క్షీణించటం మొదలయ్యింది. 1793 లో Macarney చైనా ప్రయాణంలో Qianlong Emperor ని తిరిగి వ్యాపారానికి ద్వారాలు తెరవమని ఒప్పించటానికి ప్రయత్నిస్తాడు.

Macarney తెచ్చిన జర్మన్ మేడ్ ప్లానెటోరియం, టెలిస్కోప్ లనీ, theodolites, air-pumps, electrical machines లనీ , సైన్స్ గురించి వివరించే మరెన్నో పరికరాలు ఏ కారణం చేతనో చైనీస్ చక్రవర్తి ని ముగ్ధుణ్ణి చేయలేకపోతాయి. పైగా King George III కి మీ దేశం తయారు చేసినవేవీ మాకక్కర్లేదని సందేశం కూడా పంపించడం జరుగుతుంది.
తన పూర్వీకులకు కనీసం మెకానికల్ క్లాక్స్ మీద ఉన్నంత ఉత్సుకత కూడా Qianlong Emperor కి లేకపోవడంతోఒకప్పుడు ఎన్నో ఇన్వెషన్స్ జరిగిన Middle Kingdom , చివరకి Mediocre Kingdom లా తయారవుతుంది.

1842 లో తమ ఓపియం నిల్వలని ఒక చైనీస్ అధికారి తగలబెట్టేసాడని , ప్రతీకారంతో Royal Naval gunboats , Yangzi నదిమీదుగా ప్రయాణించి Grand Canal లోకి ప్రవేశించడంతో Western World Ascendancy పూర్తిగా ధృవపడిందని చెప్పుకోవచ్చు. నష్టపరిహారంగా చైనా ఇరవైఒక్క లక్షల సిల్వర్ డాలర్స్ నీ, ఐదు నౌకరేవులని బ్రిటీష్
వ్యాపారం కోసం తెరవాల్సి వస్తుంది. అంతేకాదు హాంగ్ కాంగ్ ని కూడా వదులుకోవాల్సి వస్తుంది చివరకి.

******

ఈ రోజున చైనాలో మళ్ళీ అతిపెద్ద ఓడలని నిర్మిస్తున్నారు. నేను(పుస్తక రచయిత) జూన్2010 లో షాంగయ్ కి వెళ్ళినప్పుడు , భీతి గొల్పే సైజ్ లో ఓడల నిర్మాణం జరుగుతోంది. Wenzhou లో ఉన్న ఫ్యాక్టరీల్లో కార్మికులు వందలవేల సంఖ్యల్లో కోట్ లనీ, పదులలక్షల సంఖ్యలో పెన్నులనీ తయారు చేయటం జరుగుతోంది. బొగ్గు, సిమెంట్, మిగతా ముడిసరుకులతో నిండి ఉన్న ఎన్నో పడవలతో Yangzi నది కిక్కిరిసిపోయి కనపడుతోంది.

కాంపిటీషన్, కంపనీలు, మార్కెట్లు, విదేశీవ్యాపారము ..వీటన్నిటినికి విముఖత చూపించిన ఒకప్పటి చైనా ఈరోజున వాటిని అక్కున చేర్చుకుంది. ఈ రోజున Admiral Zheng He చైనాలో ఒక హీరో.

చరిత్ర గమ్మత్తైనది. ముప్పై సంవత్సరాల క్రితం, రాబోయే అర్ధశతాబ్ధంలో చైనా ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద ఆర్ధికశక్తిగా అవతరించబోతుంది అని మనమంటే, మనల్నెవరూ సీరియస్ గా తీసుకునేవాళ్ళు కారు.

కానీ 1420 లో , వెస్టర్న్ యూరప్ ఒక రోజున ఏషియా మొత్తం కన్నా ఎక్కువ ఉత్పత్తిని సాధిస్తుంది అనీ, ఒక సగటు బ్రిటీష్ పౌరుడు, సగటు చైనా పౌరుడికన్నా తొమ్మిదింతలు రిచ్ గా ఉండబోతాడని మనం జ్యొస్యం చెప్పి ఉంటే కూడా మనల్నెవరూ నమ్మేవాళ్ళు కారు. Western Europe లో Competition అంతటి చైతన్యవంతమైన ప్రభావాన్ని చూపించిందని వెనక్కి తిరిగి చూస్తే అర్ధం చేసుకోవచ్చు.

Monday, 15 April 2013

ముందు పోస్టులో చెప్పినట్లుగా Niall Ferguson - Civilization, The West and the Rest పుస్తకంలో దాదాపు అర్ధసహస్రాబ్ధం క్రితం పశ్చిమ యూరప్ సమాజంలో మొదలయిన ఎదుగుదలనీ, వివిధ రంగాల్లో పాశ్చాత్యసమాజపు వేసిన గణనీయమైన ముందడుగులనీ, షుమారు ఐదొందల సంవత్సరాల అప్రతిహత, అవిశ్రాంత ప్రగతి, తద్వారా పశ్చిమార్ధపు దేశాలు భూగోళం మీద సాధించిన ఆధిపత్యానికి గల కారణాలనీ వెతుకుతారు. పదిహేనవ శతాబ్ధం వరకీ నాగరికతలో, సాంకేతిక జ్ణానంలో, తత్వవిచారణలో, వివిధ పౌరవ్యవస్థల్లో ఎంతో ముందున్న తూర్పు, మధ్యప్రాచ్యపు దేశాలు క్రమంగా వెనకబడటానికి గల కారణాలని కూడా అన్వేషిస్తారు.చివరగా పాశ్చాత్యప్రపంచపు పలుకుబడి ఇటీవలి కాలంలో తగ్గుముఖం పట్టడాన్ని గుర్తిస్తూనే, తూర్పుప్రపంచపు అద్భుతంగా సాధించిన అభివృద్ధినీ, ప్రపంచం ముందు రాబోతున్న సవాళ్లని తనదైన రీతిలో ముందుంచుతారు.

ఈ పుస్తకంలో ఆరు చాప్టర్లు, నాలుగువందల పేజీలు ఉన్నాయి. ఎన్నో వివరాలూ, విశ్లేషణలూ, అభిప్రాయాలూ, రెఫరెన్సులూ, సుదీర్ఘవివరణలూ ఉన్నాయి.

ఒక్కొక్క చాప్టర్ లో కల ముఖ్యమైన పాయింట్లనీ, విషయాలనీ.. అటూఇటూ కాని సంకర తెంగ్లీష్ భాషలో ఇక్కడ పొందుపరుద్దామని ఓ ప్రయత్నం.

క్రితం పోస్టులోనే చెప్పినట్లుగా, ఈ ప్రయత్నం కాపీయింగ్ హక్కుల ఉల్లంఘన అన్న అనుమానమూ, నమ్మకమూ లేకపోలేదు. కాని అదే సమయంలో పుస్తకపరిచయాలు/సమీక్షలు బ్లాగు రచయిత కోణం లోంచి మాత్రమే చదివి, ఆ పుస్తకాలు చదవలేని/చదవని ఎందరో మిత్రుల కోసమూ, నా కోసమూ కూడా పుస్తకం లో ఉన్నదున్నట్లుగా రాస్తే పోలా అన్న ఆలోచనే.. నాతో ఈ కొన్ని వ్యాక్యాలు రాయిస్తోంది. పైగా నా గొంతూ, నా బయాస్ లు తీసేసి రాసినట్లుగా కూడా ఉంటుంది, అందువల్ల చదువరులు స్వంతగా అభిప్రాయలనేర్పరుచుకుంటారు అన్న ఒక ఆలోచన కూడా ఉంది.

పైన చెప్పినట్లుగా ఎన్ని కారణాలు చెప్పుకున్నా,ఈ డ్రాఫ్ట్ రాసేసి రెండు వారాలు దాటిపోయినా కూడా, మనసులో ఉండే క్షోభ మాత్రం పోలేదు. ఇలా చేయటం తప్పు అన్న భావం నా కాళ్లను గట్టిగా కట్టేసింది. well I should say 'చేతుల్ని".

చివరకి రాసినదాన్ని చెత్తబుట్ట దాఖలు చేయడం ఇష్టం లేక, పబ్లిష్ అనే బటన్ ని కొట్టలేక సందిగ్ధంలో పడి చివరకి ఉండబట్టలేక ఈ పుస్తక రచయితకి, నేను చేయబోయే ఈ దుశ్చర్య గురించి ముందే సమాచారాన్ని, ఈ బ్లాగు లింకు తో సహా, ముందస్తు కృతజ్ణతలనీ, క్షమాపణలనీ అందచేయడం జరిగింది.

కాపీయింగ్ రైట్స్ హక్కుల్ని అతిక్రమించనంతవరకీ, పుస్తక రచయితకి క్రెడిట్ దక్కినంత వరకీ, తన పుస్తక అమ్మకాలకి విఘాతం ఏర్పడనంత వరకీ, రచయితకీ, పుస్తకానికీ మరింత ప్రచారం లభించేంతవరకీ, తన పుస్తక సమాచారాన్ని వేరే భాషలో మరింతమంది ప్రజలు తెలుసుకుంటారన్న విషయం ఏ పుస్తకరచయితకి అయినా సంతోషకరమయిన వార్త కాకపోయినా, టాలరేట్ చేసేంత ఆమోదయోగ్యమేమో అని నమ్ముతున్నాను. అందుకే ముందుకు సాగుతున్నాను.

కాని చివరగా ఈ మాట చెప్పకతప్పదు. రచయితకి రెండు సార్లు ఈమెయిల్ ఇచ్చి, అందులో స్పష్టంగా.. ఈ బ్లాగులో తన పుస్తకం గురించీ, అందులోని పేరాగ్రాఫ్ లూ/పేజీలని నేరుగా తెలుగు(?) లో టైప్ చేయడం గురించి, దాని వెనుక ఉద్దేశాల గురించీ చెప్పి, ఏ మాత్రం అభ్యంతరమున్నా తెలియచేయమని సవినయంగా మనవి చేయడం జరిగింది. అయితే రిప్లై రాలేదు, దాన్ని రచయిత ఆమోదంగా పరిగణించడం భావ్యం కాదు. తప్పు కూడాను.

కాని రెండు వారాల వెయిటింగ్ తర్వాత నెగటివ్ రిప్లై కూడా రాలేదన్న వంచనతో ముందుకెళ్ళడానికి నిశ్చయించుకోవడం జరిగింది. కావున ఏ రోజయినా అభ్యంతరమనేది వస్తే, ఈ పోస్టులు వెంటనే డిలీట్ చేయడం జరుగుతుంది.

ఇహ ఈ సోది ఆపి, పుస్తకం లోకి.

గమనికః ఈ కింద రాసిందంతా రచయిత టోన్, నాది కాదని మనవి.
_____________________________________________________________________
1411 ప్రాంతంలో ఓ సారి ప్రపంచయాత్ర చేసొస్తే కనక మనకీ కింది విషయాలు కనిపించేవి:

One of the greatest eras of orderly government and social stability in human history గా పేరొంది, చైనా ని 276 సంవత్సరాలు పరిపాలించిన మింగ్ సామ్రాజ్యం, బీజింగ్ లో Forbidden City ని కట్టడం మొదలయ్యింది.


అదేచైనాలో, 1700 కిలోమీటర్ల పొడుగుతో, ప్రపంచంలో అతి పెద్ద మానవనిర్మిత కెనాల్ అయిన Grand Canal ని, సమూలంగా మార్చేసి మెరుగు పరచేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.



Ottoman చక్రవర్తులు Constantinople మీదకి దండెత్తటానికి సన్నాహాలు మొదలెట్టారు. (చిట్ట చివరకి 1453 లో ఆక్రమించేయడంతో ప్రపంచ చరిత్రలో అతి శక్తివంతమైన రాజ్యాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన Ottoman Empire అవతరిస్తుంది )
 

Byzantine Empire (Eastern Roman Empire) చివరి దశలో ఉంది. 



చరిత్రకారుల అంచనాల ప్రకారం అప్పటి ప్రపంచంలో దాదాపు అయిదు శాతం (ఒక కోటిన్నర జనాభా) ని తన దండయాత్రలకి బలితీసుకోని, ఒకానొక టైమ్ లో ఏషియానీ, ఆఫ్రికానీ, యూరప్ లో కొద్ది భాగాన్నీ గడగడలాడించి, ఈజిప్ట్ నీ, సిరియా నీ, ఢిల్లీ ని, విస్తరిస్తున్న Ottoman Empire నీ ఓడించి, సాక్షాత్తూ Ming Dynasty మీదకే దండెత్తిన ముస్లిం రాజు Timur 1405 లో చనిపోవటంతో, మధ్య ఏషియా నుంచి దాడులకి వచ్చే ముష్కర సేనల ప్రమాదం మింగ్ సామ్రాజ్యానికీ, ఒట్టోమాన్ ఎంపైర్ కీ తప్పిపోయింది.


ఏ రకంగా చూసినా రానున్న భవిష్యత్తు అంతా, చైనా Yongle Emperor కీ, Ottoman Sultan Murad II కీ వెలిగిపోతూ కనిపించేది.

                                                                   

అదే కాలం లో పశ్చిమ యూరప్ సమాజం ఎలా ఉందో చూద్దాం:


1347 నుంచీ 1351 వరకీ వ్యాప్తి చెందిన Black Death పశ్చిమయూరప్ సమాజం జనాభాని సగానికి తగ్గించేసింది. (యూరప్ జనాభా తిరిగి పూర్వపు స్థాయికి రావడానికి దాదాపు నూటయాభై సంవత్సరాలు పట్టింది ). ప్లేగ్ వ్యాధి సమసిన తర్వాత కూడా అది వదిలి వెళ్ళిన అపరిశుభ్ర నగరాలతో, అనారోగ్యపరిస్థితులతో యూరప్ తల్లడిల్లింది.

ఇంగ్లాండ్ Richard II రాజు ని చంపేసి, సింహాసనాన్ని ఎక్కిన Henry IV తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి ఎన్నో తిరుగుబాట్లనీ, హత్యాప్రయత్నాలనీ తప్పించుకోని రాజ్యమేలి, కుష్టు వ్యాధితో బాధపడుతూ అంతిమదశలో ఉన్నాడు.


వంద సంవత్సరాల ఆంగ్లో - ఫ్రెంచ్ వార్ కి జరుగుతున్న కాలమది. ఫ్రాన్స్ దేశం Duke of Burgundy అనుచరలకీ, Duke of Orleans అనుచరలకీ మధ్య నలుగుతున్న ప్రాక్స్తీ యుద్దం లో నలిగిపోతొంది. ఈ యుద్ధంతో పోల్చితే ఇతర యూరప్ ప్రాంతాలయిన Aragon, Castile, Navarre, Portugal and Scotland లో పరిస్థితులు కొంచెం మెరుగ్గా ఉండేవి.

ఏ మధ్యప్రాచ్యంలోనో, తూర్పుదేశంలోనొ కాదు, ఏకంగా యూరప్ లో పశ్చిమాన ఉండే Spain లోని Granada ని ఒక ముస్లిం రాజు ఇంకా పరిపాలిస్తున్నాడు. 



స్కాటిష్ రాజు James I ఇంగ్లాండ్ పైరేట్ల దాడిలో చిక్కుకొని, ఇంగ్లాండ్ లో బంధింపబడి ఉన్నాడు. ఆ వార్త విన్న అతని తండ్రి King Robert III గుండెపోటుతో మరణించాడు.

18 సంవత్సరాల దీర్ఘ బంధింపు తర్వాత 1424 లో కానీ James I విడుదల కాలేదు.


యూరప్ మొత్తం మీద సిరిసంపదలున్న ప్రదేశాలుగా చెప్పుకోతగ్గవి ఉత్తర ఇటలీ నగరసంస్థానాలయిన Florence, Genoa, Pisa, Siena and Venice లు మాత్రమే.





ఇక అదే పదిహేనవ శతాబ్ధంలో ఉత్తర అమెరికా పరిస్థితి చూస్తే:
Aztecs, Mayas and Incas ఎత్తైన టెంపుల్స్, రహదారుల్తో నిండి ఉన్న మధ్య, దక్షిణ అమెరికాలతో పోలిస్తే, అమెరికా ఓ ఆటవిక సమాజం. రెడ్ ఇండియన్ల తెగలతో నిండిపోయిన ప్రదేశం. అసలొక పూర్తి దేశం కూడా కాదు.
   

ఇలా ఒక్కొక్క ప్రదేశం అనే కాకుండా అయినా, మొత్తంగా చూస్తే కూడా 1500 లో ఫ్యూచర్ వెస్టర్న్ ఇంపీరియల్ పవర్స్ కంట్రోల్ లో కేవలం పదిశాతం ప్రపంచభూభాగం మాత్రమే ఉండేది. అది 1913 కల్లా పదకొండు వెస్టర్న్ ఎంపైర్స్ కలసి ప్రపంచంలో దాదాపు ఐదింట మూడు భాగాల్ని కంట్రోల్ చేయటం మొదలుపెట్టాయి.

సరే, ఇలా ఖండాలన్నీ తిరిగి, ప్రపంచ యాత్ర ముగించుకునేసరికి ఒక్క విషయం స్పష్టంగా కనపడేది. 

పదిహేనవ శతాబ్ధపు మధ్యలో, తూర్పు దేశాల్లోని జీవనప్రమాణాలూ, ఆ సమాజాల్లోని సుస్థిరతా, పాశ్చాత్యదేశాల్తో పోలిస్తే చాలా మెరుగని అర్ధమయ్యేది. 

ఆ కాలంలో ఎవరైనా వచ్చి , భవిష్యత్తులో పశ్చిమ సమాజాలు, ప్రపంచాధిపత్యాన్ని సాధిస్తాయని అంటే అతను/ఆమె అవాస్తవ ప్రపంచంలో బతుకుతున్న మనిషిలాగా కన్పించేవారు. 

కానీ, అదే జరిగింది.
పదిహేనవ శతాబ్ధం లో ఒక పేద్ద సివిలైజేషన్ కి అంకురార్పణ మొదలయింది. ఈ పశ్చిమ నాగరికత ఇంతింతై వటుడింతై పెరిగి ఓరియంటల్ మహా సామ్రాజ్యాలనీ, ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలేషియా ని జయించి రాజ్యాల్ని పరిపాలించడమే కాకుండా, ధరించే బట్టల విధానం, విద్యనభ్యసించే విధానం, రోగనిర్ధారణా, చికిత్సా, సంరక్షణా విధానం దగ్గర్నుంచి మొదలుకొని న్యాయవవస్థా, పౌరసమాజపు వివిధ వ్యవస్థల పరిపాలనా విధానాల వరకీ సైతం, వారి పాశ్చ్యాత్య నాగరికత జీవన విధానాన్ని ప్రపంచమంతటా వ్యాపింపచేసింది. 


మరి ఏ కారణాల వల్ల పశ్చిమ సమాజం అభివృద్ది ఊర్ధ్వదిశగా సాగింది? 

1. కేవలం అదృష్టం కలసిరావటం వల్లా?

2. భౌగోళిక, వాతావరణ పరిస్థితులు కలసి రావటం వల్లా?

3. లేక కరెబియన్ ఐలాండ్స్ లో అనుకోకుండా కాలుపెట్టి అధిక కెలోరీలుండే షుగర్ ని సులభంగా పండించుకోవటం వల్లా?

4. లేక తమ వాతావరణంలో కాటన్ కీ, కోల్ కి అనువుగా లేని భూములు కొత్తగా అడుగుపెట్టిన దేశాల్లో దొరకటం వల్లా?

5. లేక sod's law వల్ల కోల్ డిపాజిట్స్ ని మైన్ చేయడం చైనాకి కష్టతరంగా మారటం వల్లా?

6. లేక తమ గెలుపే తమకి ఒక వల లాగా తయారయిందా చైనాకి? మిగులు ఉత్పత్తి సాధ్యం కాక, అపారమయిన జనాభాకి సరిపోయినంత మాత్రమే కెలోరీస్ సమకూర్చుకోగలిగారా?

7. లేక బ్లాక్ డెత్ మిగిల్చిన అపరిశుభ్ర వీధులూ, వ్యాధితో నిండిపోయిన ఊళ్ళూ, సమాజంలో దిగువ వర్గాలని ఊడ్చేసి, కేవలం ఆరోగ్య, ధనిక వర్గాలు మిగలటం వల్ల, తరువాతి తరాలకి పాస్ అయిన వారి జీన్స్ వల్లా?

Samuel Johnson, Prince of Abissnia లో Rassela అడిగిన ప్రశ్నలో ఈ కారణాలన్నిటినీ తోసిపుచ్చుతాడు. అసలెందువల్ల యూరోపియన్స్ ఆసియానీ, ఆఫ్రికానీ అంత సులభంగా వ్యాపారార్ధం సందర్శించగలిగి, జయించగలుగుతున్నారు? వాళ్ళ తీర ప్రాంతాల్లో దిగి, వారి పోర్టుల్లో కాలనీలు నిర్మించగలుగుతున్నారు? అని అడుగుతాడు. 

దానికి Imlac అనే ఫిలసాఫర్ ఈ కింది విధంగా సమాధానాన్ని వెతుక్కుంటాడు.

"ఒక్క ముక్కలో చెప్పాలంటే యూరోపియన్స్ ఎక్కువ శక్తివంతులు, ఎందుకనగా వారెక్కువ తెలివైనవారు(wiser), జ్ణానమెప్పుడూ శక్తివంతమైనది, అజ్ణానం మీద ఆధిక్యాన్ని కలిగి ఉంటుంది. దానికి ఉదాహరణ మనిషి జంతువుల మీద ఆధిక్యాన్ని ప్రదర్శిస్తాడో చూసి తెలుసుకోవచ్చు. కాని యూరోపియన్స్ నాలెడ్జ్ మనకన్నా ఎక్కువ ఎందుకుందీ అంటే, నేను చెప్పలేను, బహుశా దైవ ఇచ్చ అలాఉందేమో అన్న సమాధానం తప్ప" 

కానీ ఇది నిజమేనా? యూరోపియన్స్ నిజంగా ఎక్కువ నాలెడ్జబులా? బహుశా ఏ 1759 లో ఆ మాటంటే సబబనుకోవచ్చు ఎందుకంటే 1650 తర్వాత వచ్చిన సైంటిఫిక్ ఇన్నోవేషన్ అత్యధికశాతం వెస్టర్న్ ప్రపంచానికి సంబంధించిందే. కాని 1500 లో? 

నిజానికి పదిహేనవ శతాబ్ధపు చివరి కాలానికి, చైనీస్ టెక్నాలజీ, ఇండియన్ మాథమేటిక్స్, అరబ్ ఆస్ట్రానమీ మిగతా దేశాలకన్నా చాలా ముందంజలో ఉన్నాయి. 

మరి ఏది? ఏ కారణం వల్ల ఇంత పెద్ద మార్పు సంభవించింది?

దీనికి చాలా మంది చాలా కారణాలు చెపుతారు/చెప్పారు. ఉదాహరణకి

1. కల్చరల్ డిఫరెన్సెసే కారణమని Max Weber అన్నాడు. 
2. The wealth and poverty of the nations అనే పుస్తకంలో David Landes ఏమంటాడంటే: స్వతంత్ర ధోరణి కలిగిన మేధోపరమైన విచారణా, సైంటిఫిక్ సిద్దాంతాల్నీ ప్రయోగాలతో నిరూపించుకోవడం, హేతువు మూలంగా చేసుకోని జరిగిన శాస్త్రపరిశోధన ఇత్యాదివి వెస్టర్న్ యూరప్ మిగతా ప్రపంచం కన్నా ముందంజ వేసి తద్వారా ఆధిపత్యాన్ని సాధించాయని ప్రతిపాదిస్తాడు. 

కానీ, తను కూడా చివరకి..వీటన్నిటినీ మించి ఏదో కారణం ఉండే ఉండాలి, బహుశా ఇవన్నీ ఒక ఎత్తయితే, పశ్చిమ సమాజాల్లోని పౌర వ్యవస్థలు (institutions) మరొక ఎత్తు, వాటివల్లనే పాశ్చాత్యదేశాలు పైవాటిలోని మంచి ఫలితాలని సమాజంలోని ప్రజలందరికీ అందజేయగలిగాయని అంటాడు. 

దీనికి ఒక మంచి ఉదాహరణ ఇరవై శతాబ్ధం లో, మానవ సమాజం తనమీద తనే అనుకోకుండా జరిపిన ప్రయోగం లాంటి చరిత్రలో కనపడుతుంది. 

1. పశ్చిమ జర్మనీ, తూర్పు జర్మనీ 
2. దక్షిణ కొరియా, ఉత్తర కొరియా
3. చైనా లోపలి చైనీస్ ప్రజలూ, చైనా బయట ఉన్న చైనీస్ ప్రజలూ

ఒకే జాతి ప్రజల్ని, దాదాపు ఒకే సంస్కృతి ఉన్న ప్రజల్ని రెండు పరస్పర విరుద్ద వ్యవస్థల్లో పెడితే ఎలాంటి ఫలితాలొస్తాయో, ప్రజల ప్రవర్తన ఎలా మారుతుందో చెప్పటానికి పైవి గొప్ప ఉదాహరణలు.

Guns, Germs and Steel లాంటి గొప్ప పుస్తకం రాసిన Jared Diamond 1999 లో రాసిన How to get Rich అనే వ్యాసంలో కూడా అదే చెప్తాడు. తూర్పు యూరేషియా మైదాన ప్రాంతంలోని ఓరియంటల్ ఎంపైర్స్ మూస ఆలోచనవిధానంలో మునిగిపోయి ఇన్నోవేషన్ ని నిర్లక్ష్యం చేయడం వల్లా, అదే సమయంలో నదులతో విడిపోయి ఉన్న వెస్టర్న్ యురేషియా లో వివిధ రాజరికాలు, నగరాలూ, దేశాల మధ్య ఉన్న పోటీతత్వం, కమ్యూనికేషన్ వల్లా పశ్చిమ దేశాలు, తూర్పు దేశాలకంటే గణనీయమైన ప్రగతి సాధించాయని అంటాడు. 

కానీ, ఇవేవీ కూడా పూర్తి కారణాల్ని సమగ్రంగా వివరించలేదేమో అన్న అనుమానం ఈ పుస్తక రచయిత వ్యక్తపరచి, తన పరిశోధనలో ఈ కింది ఆరు కారణాలు West ని, మిగతా ప్రపంచం కన్నా ముందంజ వేయించి, నాయకత్వ స్థానంలో నిలబెట్టాయని వాదిస్తాడు. 

1. Competition
పొలిటికల్ మరియు ఎకనామికల్ వ్యవస్థలు వికేంద్రీకరించబడుతూ ఉండడం వల్ల, "రాజ్యం" కన్నా "దేశం" అనే భావం పెరిగి, అది వాటి మధ్య కాంపిటీషన్ కి దారి తీసి, కాపిటలిజం అనే వ్యవస్థకి మార్గం సుగమం చేసింది

2. Science
శాస్త్రీయ శోధనా, పరిశోధన ల్లోంచి వచ్చిన ఫలితాలని అర్ధం చేసుకోవడమే కాకుండా వాటిని ఉపయోగానికి పెట్టటం వల్ల, అనేక ఇతర రంగాల్తో పాటూ మిలిటరీ రంగంలో వెస్టర్న్ వరల్డ్ కి ఆదిపత్యం లభించింది.

3. Property Rights
హింసపద్దతుల ద్వారా కాకుండా, హింస లేకుండా ఆస్థి హక్కుల తగాదాలని పరిష్కరించే చట్ట వ్యవస్థని నిర్మించి, దాన్ని సక్రమంగా అమలు పర్చడం వల్ల, ప్రభుత్వాలు ఎక్కువ కాలం సుస్థిరంగా ఉండి, అవి దీర్ఘకాలిక దేశ ప్రయోజనాల మీద పని చేయటానికి వీలు కలిగింది. 

4. Medicine
సైన్స్ లోనే ఒక భాగమయిన ఆధునిక రోగ నిర్ధారణా, చికిత్సా విధానం ప్రజలు ఆరోగ్యంగా బతకడమే కాకుండా, మనిషి సగటు ఆయుపరిమితిని పొడిగించింది. మెడిసిన్ తక్షణ ఫలాల ఉపయోగం పశ్చిమ యూరప్ సమాజం లోనే కాదు, అదే కాలంలో వారి కాలనీల్లోని వ్యాధుల్ని కూడా నిర్మూలించడానికి ఉపయోగపడింది.

5. The consumer society
మెటీరియల్ కన్సంప్షన్ అనే సంస్కృతి పెరిగి, కట్టుకునే బట్టల దగ్గర్నుంచి, వివిధ కన్స్యూమర్ గూడ్స్ వినియోగం పెరగడం వల్ల ఇండస్ట్రియల్ ఉత్పత్తులకి డిమాండ్ నిలకడగా ఉండీ, ఇండస్ట్రియల్ రివల్యూషన్ నిలబడగలిగింది. 

6. The work ethic
పై కారణాలన్నీ, ముఖ్యంగా వికేంద్రీకృత పోటీ సమాజాలు ఎంత చైతన్యవంతంగా ఉండే అవకాశం ఉందో, అదే సమయంలో కేంద్రస్థానంలో ఒక శక్తివంతమైన ప్రభుత్వమో, అలాంటి ఉక్కు వ్యవస్థో లేకపోతే అవి తొందరగా కూలిపోయే అవకాశాలు కూడా ఎక్కువే. శిఖరాగ్రాన కేంద్రీకృత మరియు అపరిమితాధికారాలు సన్నగిల్లుతూ ప్రజాస్వామ్యం వైపు భారీ అడుగులు వేస్తున్న ఈ సమాజాలు విచ్చిన్నమవకుండా ఉండాలంటే, ప్రజల్లోంచి అంతర్గతంగా వచ్చిన చైతన్యమూ, క్రమశిక్షణా వ్యక్తి శ్రేయస్సు వైపే కాకుండా, సమాజ శ్రేయస్సు వైపు కూడా వెళ్ళగలిగేలా పని సంస్కృతి, ప్రజల్లో ప్రబలంగా ఉండాలి . ఆ సంస్కృతి పెంపొందించడానికి, ఇతర కారణాలతో పాటూ ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీ లోంచి వచ్చిన ఒక మోరల్ ఫ్రేమ్ వర్క్ కూడా తోడ్పాటునందించింది.

చివరగా, కేవలం పైకారణాల వల్లే పశ్చిమ సమాజాల ఆధిక్యం సిద్దించి, చిట్టచివరకి మిగతా దేశాల కాలనైజేషన్ కి దారితీసింది అని చెప్పడం పూర్తిగా సత్యదూరమే అవుతుంది. ఈ కారణాలకి తోడు పాశ్చాత్య సమాజాల ప్రత్యర్ధుల్లో కూడా అంతర్గతంగా వచ్చిన సంక్షోభాలు సైతం ఆ సమాజాల ఎదుగుదలకి ప్రతిబంధకంగా పరిణమించాయి. 

ఉదాహరణలు గమనిద్దాం: 

1. 1640 లో చైనాలో ప్రబలిన ఆర్ధిక, ద్రవ్య సంక్షోభాలూ, వాతావరణ మార్పూ, వ్యాధులూ మింగ్ డైనాస్టీ మీద విప్లవానికి దారితీసాయి. 
2. అలాగే Ottoman empire పడిపోవడానికి బాహ్యకారణాల కన్నా, అంతర్గత కారణాలే ఎక్కువ. 
3. అమెరికా ఖండాల్లో కూడా ఇదే ఉదాహరణని గమనించవచ్చు. ఉత్తర అమెరికా ల్లోని పొలిటికల్ వ్యవస్థలు పటిష్టంగా ఎదిగాయి, కాని అదే సమయంలో దక్షిణ అమెరికా ల్లోని రాజనీతివ్యవస్థలు తేలిపోయాయి. 

Simon Bolivar ప్రయత్నాలు దక్షిణ అమెరికా దేశాలనిటినీ ఒక్కచోట చేర్చి, United States of Latin America గా రూపొందించలేకపోవడానికీ, పైన పేర్కొన్న ఆరు కారణాలకీ ఏ సంబంధమూ లేదు. 

వెస్ట్ కీ, మిగతా ప్రపంచానికీ ఈ కాలంలో ప్రస్ఫుటమైన తేడా కోసం అన్వేషిస్తే , కీలకమయిన తేడా "సమాజంలో ఏర్పరుచుకున్న వ్యవస్థల" కి సంబంధించిందని అర్ధమవుతుంది. 

చరిత్రని ఇలా వెనక్కి తిరిగి చూసినప్పుడు Western Civilization ఒక తిరుగులేని శక్తి గానూ, ఎప్పటికీ నీరుకారని ఒక పటిష్టమయిన వ్యవస్థ గానూ కనిపించవచ్చేమో, కానీ అంతకన్నా పొరపాటు లేదనే విషయం చిట్టచివరగా ఈ విషయాన్ని గుర్తించడం ద్వారా గమనించవచ్చు. 

Western Civilization ఇంతకు ముందో సారి పైకెగసి, నశించి కిందకి రాలిపోయింది. 

రోమన్ ఎంపైర్ శిథిలాలు యూరప్ అంతా చెల్లాచెదురయి పడడాన్ని చరిత్రలో గమనించవచ్చు. నిజానికి Western Civilization 1.0 version గా చెప్పుకోతగ్గ నాగరికత , Nile, Euphrates , Tigris నదుల పరీవాహక ప్రాంతాల్లో మొదలవడమే కాదు, Athens Democracy , Roman Empire అనే రెండు శిఖరాల్ని అందుకోగలిగింది. ఈ రోజున్న నాగరికతలో మౌళికమైన ప్రజాస్వామ్యం, పౌర న్యాయ వవస్థా, రేఖాగణితం, అంకగణితం, ఆర్కిటెక్చర్, క్రీడలూ, ఆంగ్ల భాషలోని అనేక పదాలూ అన్నీ కూడా ఆ " పురాతన వెస్ట్ " నుంచి వచ్చినవే. అలనాడే రోమన్ సామ్రాజ్యంలో ఉత్పత్తిదారులూ, వ్యవసాయ ఉత్పత్తులూ, నాణాల మార్పిడి చలామణీలో ఉండేవి. చట్టం, మెడిసిన్ రాజ్యంలో ప్రజలకి అందుబాటులో ఉండేది. అంత గొప్ప రోమన్ ఎంపైర్ కూడా అంతర్గతంగా ఉద్భవించిన కారణాల వల్లా, బార్బేరియన్ దండయాత్రల వల్లా, క్షీణించిపోయింది. 

మరిప్పుడు Western Civilization 2.0 కూడా అదే మార్గం వైపు వెళ్తోందా? పూర్వం నుంచీ కూడా ప్రపంచ జనాభాలో వెస్టర్న్ వరల్డ్ జనాభా శాతం తక్కువే. కాని అది ఇప్పుడు మరింత పలచబడింది. ఒకప్పుడు ప్రపంచాన్ని డామినేట్ చేసిన అమెరికా, యూరప్ ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఇంకో ఇరవై, ముప్పై సంవత్సరాల్లో చైనా, బ్రెజిల్, రష్యా, ఇండియాలు అమెరికా, యూరప్ లని దాటేసి ముందుకెళ్లబోతున్నాయి. 2007 లో అమెరికాని ముంచెత్తిన ఆర్ధికసంక్షోభం, కన్స్యూమర్ సొసైటీ ల్లో ఉండే మౌళికమైన బలహీనతల్ని బయటపెట్టింది. అసలు వెస్టర్న్ సివిలైజేషన్ కు తనమీద తనకున్న నమ్మకమే సడలిపోయినట్లుగా కనపడుతోంది. 

కాని, అది నిజమేనా? ప్రపంచవిపణి వీధుల్లో, వివిధ కూటముల వేదికలమీదా, ఇతరదేశాల్లొ వెస్టర్న్ సివిలైజేషన్ ప్రభావం క్రమక్రమంగా క్షీణించడం తప్పదా ? లేక ఇది ఒక కేవలం సంధి యుగం మాత్రమేనా? మిగతా ప్రపంచం ఎదుగుదల మొదలయి, వెస్ట్ జీవనప్రమాణాల్ని తమ తమ సమాజాల్లో అత్యధిక ప్రజలకి అందించే దశ అంతానికొచ్చినప్పుడు, ప్లేయింగ్ ఫీల్డ్ సమాంతరమయ్యాక, ఆ ఎదుగుదలలో భాగంగా ఉండే కరప్షనూ, పొల్యూషనూ, అసమానతలూ మిగతా ప్రపంచాన్ని పట్టి పీడించి వాటి ఎదుగుదల శాతాన్ని పడదోస్తాయా? అలా అయితే వెస్టర్న్ వరల్డ్ ముందులా వెలిగిపోకున్నా , మిగతా ప్రపంచం కన్నాముందే నిలబడుతుందా ? లేక క్రమక్రమంగా వెనకపడిపోతుందా?

ఇలాంటి పరిస్థితుల్లొ దాదాపు మూడొందల సంవత్సరాల పైబడిన పశ్చిమ ప్రపంచపు నిరంతర ఎదుగుదలకి కారణాల్ని లోతుగా అధ్యయనం చేయవలసిన అవసరం ఎంతయినా ఉంది.

Saturday, 13 April 2013

ఈ బ్లాగు నా పేరు మీద ఉన్నప్పటికీ, సృష్టించినవాడికే అన్ని హక్కులూ అన్నట్లుగా నడిపించే దేవుడి ప్రిన్సిపుల్ ప్రకారమైనా, అదే సిద్దాంతాన్ని ఆచరణలో పెట్టే కాపిటలిజం ప్రిన్సిపుల్ ప్రకారమయినా ఈ బ్లాగు మీద సర్వహక్కులన్నీ ఓ స్నేహశీలికి దక్కుతాయి.

కరుణతో బహుమతి నా చేతుల్లో పెట్టగానే చేతులు పట్టుకోని కృతజ్ణతలు చెప్పేస్తూ, ఆ బరువుని మెల్లిగా అవతలి చేతుల్లోకి జారుస్తూ, ఇది నువ్విచ్చిందే కాబట్టి, ఇది నీదే అని తప్పుకోబోతున్న నా అతితెలివిని కనిపెట్టి, 'ఇచ్చింది నేనే కాని పెంచాల్సింది తమరే... మానవా' అని హెచ్చరిస్తూ డిటాచ్డ్ గా దూరంగా నిలబడిపోయిన తనకోసం  ఏదైనా ఒక పోస్టు రాసి జారుకుందాం అని తలచి చేతులు మడచి కూర్చుంటే, అసలు చేయి కదలదే?!

ఏం రాస్తాం? అసలు రాయడానికేముందని నా దగ్గిర? ఎంగిలి ఆలోచనలూ, ఎకో ఛాంబర్స్ లోని రెటరిక్కూ తప్ప.

"వ్యాక్యమేదైనా రాసినప్పుడు సంగీతస్వరంలా అనిపించాలి.. దాన్లో రాగాల తూగుండాలి..వానవిల్లుమీద నడిచి మేఘాల్లో తేలినట్టుండాలి..అప్పుడే స్కూలుకొచ్చిన పిల్లలు ప్రభాత వేళ ప్రార్థన సమయంలో లైనుకట్టి నిల్చున్నట్టుండాలి. అప్పుడప్పుడూ భావాలు ఎర్రకోట ముందు సైనికుల్లా కవాతుచెయ్యాలి " అంటారు అరుణపప్పు.

అదంతగా గుర్తుండిపోయాకా, ఏవయినా బుర్రలోకి వచ్చినా ఇంకేం రాస్తాను, రాయగలను?

             ***                               ***                                    ***

ఏం రాయగలనా అని ఆలోచిస్తే  Empty Rhetoric కీ, Rantings కీ,  Identity based divisions కీ వాటిని బేస్ చేసుకోని రాసే నిజాయితీలేని కథలు కాని కథలకీ అంతే లేదు. సరే దొడ్డిదారులు వెదుక్కుందామని చూస్తే.. సినిమాలూ, పుస్తకాలూ, రంగుల దళసరి పలకల్లోంచి అందంగా కనిపించి..అందర్నీ మోసం చేసే నాస్టాల్జియాలూ ఎట్సెట్రా  కనిపించాయి.అప్పుడయితే స్వంతంగా ఏం ఆలోచించక్కర్లేదు, చూసిందాన్నో, చదివినదాన్నో, మసక మసగ్గా మంచి విషయాలు మాత్రమే గుర్తుంచుకునే మెమోరీ లోంచే రాసేస్తే పోలా అనిపించినా, వాటిక్కూడా చాలా నైపుణ్యం కావాలి. ముందు చదివినదాన్నో, చూసినదాన్నో ఆకళింపు చేసుకోవాలి, సెంట్రల్ పాయింట్ ఏంటో గ్రహించుకోవాలి, దాని చుట్టూ అల్లినవేవో, చూపినవేవో గుర్తుపెట్టుకోని సమగ్రంగా మనమాటల్లో ఇరికించి, పూర్తిగా చెప్పీ చెప్పకుండా, మనం రాసింది చదివి ఊరుకోకుండా, అసలు రచనేదో చదివించేలా రాయగలగాలి.

ఉఫ్..

హబ్బా... ఒక్క పోస్టు రాయడం ఇంత కష్టమా? అంత టాలెంట్ లేదే నా దగ్గిర?!!  'మరందుకే గబుక్కున చేతులు చాపి తీసుకోని థాంక్స్ చెప్పొద్దురా కుమార్ బాబూ' అని అనుకున్నవాడిని, అలానే ఊరుకోకుండా ఇలా బయటకోస్తే ఇంతే గతి.

సో, ఇహ చిట్టచివరిగా నీతి మాలిన పని చేద్దామని నిర్ణయించేసుకున్నా. ఏ పుస్తకాన్ని పరిచయం చేసినా గమనించిందేంటంటే అత్యధికశాతం అది కొనుక్కొనో, తీసుకొనో చదవరు(నాతో సహా). కారణాలనేకం. ఆసక్తి పుస్తకపరిచయం చదవటంకన్నా ఎక్కువ లేకపోవటం, పుస్తకం దొరక్కపోవటం, ఖరీదు ఎక్కువగా ఉండటం, ఇతర ప్రాధాన్యాల ముందు ఈ పుస్తకం చదవాలి అనుకున్న నిర్ణయం కిందకి జారిపోవటం ఎట్సెట్రా...ఎట్సెట్రా...

అందుకని పుస్తకపరిచయం కన్నా, అసలు పుస్తకం లోని విషయాలే డైరక్టుగా రాస్తే పోలా? పరిచయాలేవో చదివిన వాళ్లే చేసుకుంటారు, అంచనాల నిచ్చెనలేవో వాళ్లే వేసుకుంటారు, మోయాల్సిన బరువులేవో, కొలవాల్సిన కొలతలేవో వాళ్లే నిర్ణయించుకుంటారు.

కాని తప్పు కదా? ఎన్ని రెపరెన్స్ లిచ్చి, ఎన్ని డిస్క్లెమయిర్లు పెట్టి అక్కడక్కడి పేరాగ్రాఫులు రాసినా, కాపీయింగ్ ని కాపీయింగ్ అనే అంటారు.

సరే ఇలాక్కాదని, పుస్తక రచయిత కి ఈమెయిల్ రాసాను.

"ఆర్యా..మీ పుస్తకం నాకు నచ్చింది. నా మాతృభాషలో మీ పుస్తకం గురించి నాలుగు పేరాగ్రాఫుల పరిచయం కాకుండా, ఇంకొంచెం విపులంగా రాస్తే మీర్రాసిన నాలుగు విషయాలు వేరేభాష మాట్లాడే/చదివే వాళ్ళకందడమే కాకుండా, స్వామి కార్యమూ స్వకార్యమూ కలసి వచ్చేలా మీ రీచ్ కూడా ఎక్కువవుతుంది కదా అన్న తలపుతో...మీర్రాసిన ముఖ్యమయిన పాయింట్స్ నేను కాపీకొట్టబోతున్నాను...అదే.. నా భాషలో రాయబోతున్నాను. ఇది మీకు సమ్మతమే అని ఆశిస్తున్నాను కానిచో నాకు తెలిపినయెడల నేనీ దుర్మార్గానికి తలపెట్టను, ఏదయినా తెలియపరచండీ" అని విన్నపాన్ని పంపాను.

అనుకున్నట్లుగానే సైలెన్స్.

మళ్ళీ ఓ రిమైండర్ కూడా పంపి, రెండు వారాలు వేచి ఉన్నాను. ఈ లోపల నా చౌర్యపు పనిని కొనసాగిస్తూ..

ఇప్పటివరకీ ఏ రిప్లై రానందున, ప్రస్తుతానికి ఇది పబ్లిష్ చేయడానికే డిసైడ్ చేసుకున్నాను.

This is about a book called 'Civilization - The West and the Rest' by Neill Ferguson.  ఇంతకీ ఈ పుస్తకమే ఎందుకూ అంటే పెద్దగా సమాధానం ఏమీ లేదు. తెలుగు బ్లాగుల్లో కనపడే రెటరిక్ పరిధి దాటి కాస్త ముందుకేమన్నా వెళ్ళడానికి పనికొస్తుందేమో అన్న ఆశ అంతే. ఇదే సబ్జక్ట్ మీద Ian Morrison రాసిన పుస్తకాలూ కూడా పరిచయం చేయాలన్న ఆశ కూడా ప్రస్తుతానికి ఉంది. ఏ దృష్టికోణమూ పరిపూర్ణము కాదు కాబట్టి, దీనికి వ్యతిరేకంగానో, టాంజెన్షియల్ గానో ఉండే ధీసిస్ లు కనపడితే అవి చదివి పరిచయం చేయాలన్న ఆశ కూడా ఉంది, కాని అసలు ఈ పుస్తకమే పూర్తి చేస్తానో లేదో అనుమానం కాబట్టి, ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెన వేసిన చందాన నా ప్రగల్బాలన్నీ ఇంతటితో ఆపేస్తే మంచిది.

ఎనీవే, ఇహ సోది ఆపేసి...నెక్స్ట్ పోస్ట్ రాస్తూ కూర్చుంటా...అంటే...పైన చెప్పిన పుస్తకం గురించి :)

Disclaimer:
The upcoming blog post(s) will have some introduction articles about the book "Civilization - The West and the Rest' by Neill Ferguson. As part of introducing I have written some paragraphs/pages from the book in Telugu language. The author of the book has already been informed about this attempt. However, If any copyright acts are violated, please let me know, and I will delete these blog post(s).